Moviesసాయి పల్లవికి అది కూసింత ఎక్కువే..ఏం పిల్ల రా బాబు..!!

సాయి పల్లవికి అది కూసింత ఎక్కువే..ఏం పిల్ల రా బాబు..!!

మలర్ బ్యూటి ..టాలీవుడ్ హైబ్రీడ్ పిల్ల సాయి పల్లవి అంటే జనలాకు అదో రకమైన ఇష్టం. దానికి కారణాలు ఏనైనా కానీ, మెయిన్ రీజన్ మాత్రం ఉన్నది ఉన్నట్లు మొహానే చెప్పేస్తుంది. అది ఎవ్వరైన సరే..ఎదుట ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా సరే..మనసులో అనిపించింది..ఇట్టే చెప్పేస్తుంది. దానిని మనం లైవ్ లోనే చాలా సార్లు చూశాం. లవ్ స్టోరీ సినిమా ఈవెంట్ లో కూడా..చిరు, నా సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశావు అంటే టక్కున మైక్ తీసుకుని..అసలు మ్యాటర్ చెప్పేసింది.

మెగాస్టార్ లాంటి ఆయన తో చేసే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ వదులుకోరు . కానీ, ఈ హైబ్రీడ్ పిల్ల మహా మొండిది. కధ నచ్చక పోతే..అవతల ఉన్నది..ఎవ్వరైన సరే..రిజెక్ట్ చేసి పడేస్తుంది. అంత మొండి ఘటం సాయిపల్లవి. రీసెంట్ గా గార్గి సినిమాతో మరో అద్భుతమైన హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి..రీసెంట్ గా మీడియా తో ముచ్చటించింది. సినిమా సక్సెస్ చేసినందుకు అభిమానులకు ధ్యాంక్స్ చెప్పుతూ..మీడియా రిపోటర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా ఆన్సర్ ఇచ్చింది.

ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్..” మీకు ఎప్పుడైన కోపం వచ్చిందా..?” అని అడగ్గా..సాయి పల్లవి నవ్వుతూ..తనదైన స్టైల్ లో..”నాకు అంత ఈజీగా కోపం రాదు..చాలా ప్రశాంతంగా ఉంటాను. కానీ, ఎప్పుడైన సరే,,నేను గాడ నిద్రలో ఉన్నప్పుడు..నన్ను నిద్ర లేపితే..నాకు పిచ్చ కోపం వస్తుంది. ఆ టైం లో నేను ఏం చేస్తానో నాకే తెలియదు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సాయి పల్లవిలో ఈ యాంగిల్ కూడా ఉందా..అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. మరి కొందరైతే..నిద్ర లో లేపితే ఎవ్వరికైన కోపమే..కానీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే..సాయిపల్లవి కి కూసింత ఎక్కువ కోపమే వస్తుంది…ఇంకా చిన్న పిల్లల అలవాట్లు పోలేదు..ఏం పిల్ల రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news