Moviesఆ డైరెక్టర్ నాతో అలా..ఎన్ని సార్లు ఏడ్చానంటే..షాకింగ్ మ్యాటర్ లీక్ చేసిన...

ఆ డైరెక్టర్ నాతో అలా..ఎన్ని సార్లు ఏడ్చానంటే..షాకింగ్ మ్యాటర్ లీక్ చేసిన పూజా..!!

ప్రస్తుతం ఇండస్ట్రీలో పూజా హెగ్డే పేరు ఎంతలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లో అమ్మడు మంచి స్వింగ్ మీద ఉంది. వరుస సినిమాలకు సైన్ చేస్తూ టాప్ హీరోయిన్ల లిస్ట్ ఉంది. ప్రస్తుతం పూజా ఆమె హీరోయిన్ గా నటించిన పాన్ ఇండియా మూవీ “రాధ్యే శ్యామ్ ” సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉంది.

ప్రభాస్ – పూజా జంటగా నటించిన చిత్రం “రాధ్యేశ్యామ్” మరో మూడు రోజుల్లో ఈ సినిమా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర అవుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే పూజా ముంబైలో మీడియా తో ముచ్చటించింది. రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూనే..ఈ సినిమా షూటింగ్ టైంలో తను ఎదుర్కున్న సమస్యలు నేర్చుకున్న పాఠాలు గురించి అభిమానులతో పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ..”రాధే శ్యామ్ షూటింగ్ చాలా కాలం జరిగింది. కరోనా కారణంగా లాక్ డౌన్ వల్ల కొన్ని నెలలు షూటింగ్ ఆగిపోయింది. ముఖ్యంగా ఇటలీ, జార్జియా దేశాలకు వెళ్లి అక్కడి అందమైన లొకేషన్స్‌లో కొన్ని సీన్స్ ని పాటలని చిత్రీకరించాము . ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు కాబట్టి చాలా సీన్స్ రిపీటెడ్‌గా నటించాల్సి వచ్చింది. అప్పుడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం చాలా సార్లు ఏడ్చాను.

హిందీలో సీన్ షూట్ చేసిన వెంటనే మళ్లీ తెలుగులో చేయాల్సి వచ్చేది..ఇక దాంతో ఎక్కువ సార్లు ఏడిచే దాని. ఆ టైంలో నన్ను డైరెక్టర్ రాధాకృష్ణ చాలా సార్లు ఆటపట్టించారు.. చాలా సార్లు సరదాగా ఏడిపించారంటూ” పూజా చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా ప్రేరణ గా కనిపిస్తున్న పూజా తన ఆ రోల్ ని కెరీర్ లోనే మర్చిపోలేనని ఇప్పటికే చాలా ఇంటర్వ్యుల్లో చెప్పింది. మరి చూడాలి ప్రేరణ గా పూజా ఎలా మెప్పించబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news