Moviesమైండ్‌బ్లాకింగ్ మ‌ల్టీస్టార‌ర్‌... ఆ స్టార్ హీరో బ‌న్నీతో కొర‌టాల షాకింగ్ స్కెచ్‌..!

మైండ్‌బ్లాకింగ్ మ‌ల్టీస్టార‌ర్‌… ఆ స్టార్ హీరో బ‌న్నీతో కొర‌టాల షాకింగ్ స్కెచ్‌..!

క్లాస్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ మూడేళ్ల పాటు టైం తీసుకుని మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా తెర‌కెక్కించారు. చిరంజీవితో పాటు చిరు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల 29న ఆచార్య భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో కొర‌టాల బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో అలియాభ‌ట్‌ను హీరోయిన్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా త‌ర్వాత కొర‌టాల చేసేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోనే అని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్ ? కొర‌టాల ఇండ‌స్ట్రీలోని ప్ర‌తి ఒక్క హీరోతో ఓ సినిమా చేయ‌డమే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. సీనియ‌ర్ హీరో బాల‌య్య‌తోనూ ఓ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సినిమా పూర్త‌యిన వెంట‌నే అల్లు అర్జున్‌- కోలీవుడ్ హీరో ధ‌నుష్ కాంబినేష‌న్లో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇటు టాలీవుడ్‌లోనే తిరుగులేని స్టైలీష్ స్టార్ బ‌న్నీ, అటు కోలీవుడ్ క్రేజీ స్టార్ ధ‌నుష్ కాంబినేష‌న్ అంటే ఇది పాన్ ఇండియా మల్టీస్టార‌ర్ అవుతుంద‌న‌డంలో డౌట్ లేదు. అస‌లు ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌క్క‌ర్లేదు… జ‌స్ట్ ఎనౌన్స్ అయితేనే క్రేజ్ వ‌చ్చేస్తుంది. 2023 స్టార్టింగ్‌లో ఈ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకు వెళ్లేందుకు కొర‌టాల ప్లాన్ చేస్తున్నాడు.

కొర‌టాల కూడా ఎప్ప‌టి నుంచో పాన్ ఇండియా లెవ‌ల్లో ఓ సినిమా తీయాల‌ని గ‌ట్టిగా ట్రై చేస్తున్నాడు. కొర‌టాల‌కు ప్లాపులు లేవు. చేసిన సినిమాలు అన్నీ హిట్లే. అయితే కొర‌టాల క‌థ‌ల‌కు పాన్ ఇండియా అప్పీల్ ఉండ‌డం లేదు. అందుకే అవి నాన్ టాలీవుడ్‌లో స‌రిగా ఆడ‌డం లేదు. ఇక ఇప్పుడు తాన స్టామినా ఏంటో పాన్ ఇండియా లెవ‌ల్లో ఫ్రూవ్ చేసుకునేందుకే ఈ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news