Moviesలైవ్ లోనే ఆ యాంకర్ ను బుతులు తిట్టిన హెబ్బా పటేల్..కారణం...

లైవ్ లోనే ఆ యాంకర్ ను బుతులు తిట్టిన హెబ్బా పటేల్..కారణం ఏంటో తెలుసా..?

హెబ్బా పటేల్..ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో,తన నటనతొ ఎంతో మంది కుర్రకారుని ఫిదా చేసింది. టాలీవుడ్ కి రాహుల్ రవీంద్ర హీరోగా వచ్చిన ‘అలా ఎలా” అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్.. తనదైన స్టైల్లో నటిస్తూ అభిమానుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇక రాజ్ తరుణ్ హీరో గా నటించినాకుమార్ 21ఎఫ్’ మూవీతో హెబ్బా పటేల్‌కి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ‘ఈడో రకం ఆడో రకం’, ‘అంధగాడు’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,’ఏంజెల్’, ‘మిస్టర్’, ’24 కిస్సెస్’ వంటి సినిమాల్లో నటించింది.


ఆ సినిమాలు ప్లాప్ కావడంతో హెబ్బా పటేల్కి అవకాశలు తగ్గిపోయాయి. కావాల్సినంత అందాలు ఆరబోసినా కూడా ఈమె వైపు స్టార్ హీరోలు అస్సలు ఆసక్తి చూపించలేదు. దీంతో డైరెక్టర్స్ ఆమెను పట్తించుకోవడమే మానేసారు. రీసెంట్ గా రామ్‌ ’రెడ్‌’ చిత్రంలో ఐటెమ్‌ పాత్రలో కనిపించింది ఈ అమ్మడు. అయినా కానీ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే హెబ్బా పటేల్.. ఎప్పటికప్పుడు తన ఫోటోలు అభిమానులతో పంచుకుంటుంది.

కాగా, హెబ్బాపటేల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆమె సినిమా ప్రమోషన్ స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో యాంకర్ చిత్రవిచిత్రమైన ప్రశ్నలు వేసి విసిగించడంతో.. సహనం కోల్పోయి అతన్ని తిట్టేసిందట. “ఏం మాట్లాడుతున్నావ్ రా మాదాపూర్” అంటూ నోటికి వచ్చిన్నట్లు తిట్టి పడేసిందట. ఇక్కడ షాకింగ్ ఎమిటంటే ఈ ఇంటర్వ్యు తరువాత సదరు ఛానల్ వాల్లకి ఇప్పటి వరకు ఒక్క ఇంటర్వ్యు కూడా ఇవ్వలేదట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news