Moviesబాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’..48 గంటల్లో కళ్ళు చెదిరే...

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’..48 గంటల్లో కళ్ళు చెదిరే కలెక్షన్స్..!!

సెన్సేషనల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్, కత్తిలాంతి కత్రినా కైఫ్ జంటగా తెరెకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సూర్యవంశీ’. వెల్ కం, తీస్‌మార్‌ ఖాన్, నమస్తే లండన్, సింగ్ ఈజ్ కింగ్ తదితర చిత్రాల్లో కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్ కలిసి నటించారు. కానీ ఈ సినిమాలో వాళ్ల పర్ ఫామెన్స్ కు మమి మార్కులు పడడమే కాదు..విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు.దీపావళి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి..బ్లాక్ బస్ట్అర్ విజయం అందుకుంది.

ఇక ఈ సూర్య‌వంశీ సినిమాకు అభిమానులు బ్ర్హ్మ రధం పడుతున్నారు. అంతేకాదు ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు చూసిన‌ నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. కేవలం రెండంటే రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 60 కోట్లు వసూలు చేసింది. ఇది మాములు విషయం కాదు. మూడో రోజు 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అయిపోయింది. నిజానికి కరోనా మహమ్మారి తరువాత బాలీవుడ్ సినిమాలు వంద కోట్ల కలెక్షన్స్ మాట వినడం ఇదే తొలిసారి. ఇలాంటి తరుణంలో వచ్చిన అక్షయ్ సినిమా ..త్వరలో రాబోయే సినిమాల‌కు ఇది మంచి బూస్టప్ లా అవుతుందని పలువురు వాళ్లు భావిస్తున్నారు.

మహారాష్ట్రతో పాటు మిగతా కొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం మరో విశేషం.ఫస్ట్ డే 26.29 కోట్లు, సెకండ్ డే 23.85 కోట్లు కలెక్ట్ చేసి, సరైన కమర్షియల్ సినిమా వస్తే ఆడియన్స్ ఏ స్థాయిలో ఆదరిస్తారనే విషయం మరోసారి ప్రూవ్ చేసింది. ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మూడో రోజుతో 100కోట్ల మార్క్ టచ్ చేస్తుందంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు. కరోనా మహమ్మారి కారణంగా మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాలలో సినిమా థియేటర్లు మూత పడటంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో విడుదలైన అక్షయ్ కుమార్ సూర్యవంశీ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతూ సంచలన వసూళ్ళు తీసుకొస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news