Moviesమూడు నిమిషాల సీన్ కోసం 40కోట్లా.. అంత హాట్ రొమాన్స్ నా..?

మూడు నిమిషాల సీన్ కోసం 40కోట్లా.. అంత హాట్ రొమాన్స్ నా..?

మెగా పవర్ స్టార్ రాంచరణ్..ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR లొ హీరోగా చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 7న రిలీజ్ కానుంది.ఈ సినిమాలో ఆయన స్వాతంత్య్ర పోరాట యోధులు అల్లురి సీతరామరాజు పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తూన్నప్పుడే.. మరో బడా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను లైన్లో పెట్టేసాడు చెర్రీ. తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో నేరుగా తీయనున్న తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఇక మరో వైపు పాన్ ఇండియా మూవీ తరవాత రామ్ చరణ్ చేయబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

అయితే మొదట ఈ సినిమా అలియా భట్ కు హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని కొందరు అన్నారు కాని అలియా భట్ ని కాకుండా కియరా అద్వానినే ఫైనల్ చేసారు చిత్ర బృందం. ఇప్పతికే ఈ జంట వినయ విధేయ రామ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికి..ఈ ఇద్దరి జంటకు మాత్రం మచి మార్కులే పడ్డాయి.ఆల్రెడీ వినయక్ విధేయ రామ సినిమాలో చరణ్ తో జోడీ కట్టింది కియరా అద్వాని ఈ మూవీలో మాత్రం చరణ్ తో హాట్ రొమాన్స్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది.

ముఖ్యంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ కియరా ,చరణ్ తొ ఓ సీన్ లో మరింత హాట్ గా కనిపిస్తుందట. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ పాట కోసం ఓ భారీ సెట్ వేయబోతున్నారత.ఆ సెట్‌ కోసం మేకర్స్‌ భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సెట్‌కు దాదాపు 40 కోట్లను కేటాయించినట్టుగా టాక్ వినిపిస్తుంది. ‘శివాజీ’ సినిమాలోని ‘వాజీ వాజీ’ అనే పాట తరహాలో ఈ పాటను డిజైన్ చేశారట శంకర్. మరి చూడాలి ఈ పాట ప్రజలకు ఎలా రీచ్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news