Moviesక్రేజీ అప్డేట్: మ‌హేశ్ బాబుతో ఎన్టీఆర్‌..రికార్డులు బద్దలవ్వాల్సిందే..!!

క్రేజీ అప్డేట్: మ‌హేశ్ బాబుతో ఎన్టీఆర్‌..రికార్డులు బద్దలవ్వాల్సిందే..!!

ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లైతే మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. రానా,పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్న “భీంలా నాయక్”..అలాగే చరణ్-తారక్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్..ఇలా ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకే తెర పై ఇద్దరు బడా హీరోలు మనముందుకు రాబోతున్నారు.సినిమా తీయ్యడం లేదు కానీ..ఓ షో ద్వారా వాళ్ల అభిమానులనౌ అలరించడానికి ఒకే వేదిక పై కనిపించి అలరించనున్నారు.

యస్..టాలీవుడ్ లోనే మొస్ట్ హ్యాండ్ సం హీరో మహేష్ బాబు..యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు అనే షో ద్వారా మనముందుకు రాబోతున్నారు. ఇక ఈ విషయమై జెమిని టీవీ అధికారిక ప్రకటన కూడా చేసింది. దీంతో అటు మహేష్ అభిమానులు..ఇటు తారక్ అభిమానులు ఇద్దరు ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టిస్తోన్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షో ని జూనియ‌ర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో హోస్ట్ చేస్తూ స్పెష‌ల్ అట్రాక్షన్ గా నిలిస్తున్నారు.

ఇప్పటికే ఈ షోకు చాలా మంది సినిమా సినీ తారలు గెస్ట్ లుగా రాగా..ఇప్పుడు ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు అయ్యారు. మహేష్ తారక్ తో కలిసి సందడి చేయనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు ఛానెల్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. మహేష్ గెస్ట్ గా రాబోతున్న షోకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని ప్రకటించారు. ఆ పోస్ట‌ర్‌లో మ‌హేశ్ క‌నిపిస్తాడు. ఎన్టీఆర్‌.. త‌న‌తో ఏదో మాట్లాడుతూ క‌నిపిస్తున్న ఆ పోస్ట‌ర్‌ను చూసి.. మ‌హేశ్ అభిమానులు అయితే అస్స‌లు ఆగ‌డం లేదు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news