Moviesవామ్మో..మా ఎన్నికల్లోకి ప్రశాంత్ కిషోర్.. యమ రంజుగా మారిన "మా" ఎన్నికలు..!!

వామ్మో..మా ఎన్నికల్లోకి ప్రశాంత్ కిషోర్.. యమ రంజుగా మారిన “మా” ఎన్నికలు..!!

గతంలో ఎప్పుడు లేనంగా రచ్చ రచ్చగా సాగుతున్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఎన్నికలూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగుతున్నారు. ఎన్నికలకు ముందుగానే మూడు ప్లటూన్ల బలగాలతో భారీ బందోబస్తు పోలింగ్ కేంద్రం వద్ద మోహరించారు. పోలింగ్‌లో గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ప్ర‌చారంలో ఎంత వాడీవేడిగా జ‌రిగాయో ఈ రోజు ఎన్నిక‌ల్లోనూ అంతే వాడీవేడీగా జ‌రుగుతున్నాయి. ఇక పోలింగ్ వేళ ప్ర‌కాష్‌రాజ్ ఫ్యానెల్ రిగ్గింగ్ చేస్తోంద‌ని మంచు విష్ణు ఫ్యానెల్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో అక్క ఘర్షణ్ వాతావరణం నెలకొంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం 2 గంటలకు ముగియనున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల వరకు 380 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. మా ఎన్నికల పై నటుడు జీవీ షాకింగ్ కామెంట్స్ చేసారు. ప్రస్తుత మా ఎన్నికల పరిస్ధితి చూస్తుంటే.. ఈ ఎన్నికల్లో ఆ ఒక్కటి తక్కువైందని ఫనీ గా కామెంట్స్ చేసారు. అంటేఅ ఈ ఎన్నికల్లో ఇక ప్రశాంత్ కిశోర్ రావడం ఒక్కటే తక్కువ అన్నారు. అంతేకాదు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఆయన కనుకా పోటీ చేస్తే.. డబ్బులిచ్చి మరీ ప్రశాంత్ కిశోర్‏ను తీసుకువస్తానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో జీవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news