Moviesసడెన్‌గా వెండితెరకు దూరమైన‌ 5గురు స్టార్ హీరోయిన్స్ ..!

సడెన్‌గా వెండితెరకు దూరమైన‌ 5గురు స్టార్ హీరోయిన్స్ ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరి స్థానం కూడా చిరకాల పాటు కొనసాగదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది తప్పకుండా వర్తిస్తుంది. వీరు కొన్ని సినిమాలలో నటించగానే ఆటోమేటిక్ గా అందం, శరీరంలో మార్పులు రావడంతో అవకాశాలు కూడా తగ్గిపోతాయని చెప్పవచ్చు. ఇకపోతే తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు నటించి, మెప్పించి అకస్మాత్తుగా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అలా అకస్మాత్తుగా దూరమైన హీరోయిన్లు ఎవరెవరున్నారో ఒకసారి తెలుసుకుందాం.

1. అన్షు :
ప్రభాస్ సరసన రాఘవేంద్ర, నాగార్జున సరసన మన్మథుడు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు.

2. కమలినీ ముఖర్జీ:
గోవిందుడు అందరివాడేలే, ఆనంద్, మన్యంపులి, జగద్గురు, ఆది శంకర వంటి సినిమాలలో నటించి మెప్పించిన కమలినీ, ఆ తరువాత సినీ ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు. అందం, అభినయంతో చక్కని మోముతో ప్రేక్షకులను అలరించిన కమలిని , సినీ ఇండస్ట్రీకి ఎందుకు దూరమైంది అనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు.

3. గోపిక:
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, విజేత 2007 , వీడు మామూలోడు కాదు, యువసేన వంటి సినిమాలతో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె సొంత రాష్ట్రంలో ఫ్యామిలీతో సెటిల్ అయిపోయింది.

4. గజాల :
తొట్టి గ్యాంగ్, మనీ మనీ మోర్ మనీ , స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈమె, అనుకోకుండా ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ,తీవ్ర మనస్తాపానికి గురై..గజాల తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు అడుగు పెట్టలేదు. త్వరలో తన భర్త డైరెక్షన్ లో సీరియల్స్ లో నటిస్తానని చెబుతోంది.

5. రక్షిత:
ఆంధ్రావాలా, అందరివాడు ,ఇడియట్, నిజం, శివమణి లాంటి చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత, ఆ తర్వాత ఈమె కూడా సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. ఈమె క‌న్న‌డ డ్యాన్స్ డైరెక్ట‌ర్ ప్రేమ్‌ను ప్రేమ వివాహం చేసుకుని బెంగ‌ళూరులో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news