Moviesబిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్న ప్రభాస్..తేడా కొడితే మహా డేంజర్..??

బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్న ప్రభాస్..తేడా కొడితే మహా డేంజర్..??

ప్రభాస్..చిన్న హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తరువాత మీడియం రేంజ్ హీరోగానూ .. అటు తరువాత స్టార్ హీరోగానూ.. ఇప్పుడు అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఉన్నవని బడా ప్రజెక్ట్ లే. రాధేశ్యాం, సాలార్, ఆది పురుష్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ఈ ఆరు అడుగుల అందగాడు. ఇప్పటికే రాధేశ్యాం సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం సాలర్ సినిమా, ఆది పురుష్ తో పాటు నాగ్ అశ్విన్ సినిమా లైన్లో ఉన్నాయి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో ఈ మధ్యే ప్రభాస్ సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ దివా దీపికా పదుకొణే హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమాలో సమంతా ఓ ముఖ్యమైన పాత్ర పోసిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

ఇక ఇప్పటికే ఇంత మంది ప్రముఖులు చేస్తున్న ఈ సినిమాలో … మరో ఇద్దరు టాప్ హీరోలను ఈ సినిమాలో యాడ్ చేసారట. వాళ్లు ఏవరో కాదు.. టాలీవుడ్ టాప్ హీరోలు నాని మరియు విజయ్ దేవరకొండ. వీరిద్దరూ నాగ్ అశ్విన్ మరియు ప్రభాస్ ఉన్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటించనున్నారని టాలీవుడ్ కోడైకూస్తుంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ఇక దీని పై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ…క్రేజ్ ఉన్న స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో… మరో ఇద్దరు హీరోలు అవసరమా? అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ నటిస్తుండడం వల్ల ప్రభాస్ క్రేజ్ తగ్గిపోతుందనే చర్చ కొనసాగుతున్న వేళ.. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఇద్దరు హీరోస్ నా..ఏం అవసరం లేదు.. మాకు ప్రభాస్ ఒక్కడే చాలు అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక్క వేళ ఈ సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తే… కచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ లో నిరుత్సాహం తప్పదని కొందరు భావిస్తున్నారు. మరి చూడాలి ఈ నాగ్ అశ్విన్ ఎలాంటి డెసిషన్ తిసుకుంటాడొ..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news