Moviesరోజాంతా ఎన్టీఆర్ ఫొటో సెష‌న్‌... కొత్త స్టైల్లో ?

రోజాంతా ఎన్టీఆర్ ఫొటో సెష‌న్‌… కొత్త స్టైల్లో ?

బాలీవుడ్ మెగా‌స్టార్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యహారిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోకు ఎంతో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. కేబీసీ షో బిగిన్ అయితే చాలు.. టీవీలకు ప్రేక్షకులు అతుకుపోతారు.బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షోకు దేశవ్యాప్తంగా గొప్ప ప్రజాదరణ రావడంతో.. దీన్ని తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో ప్రసారం చేసారు.

ఇప్పటి వరకు తెలుగులో నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. కింగ్ నాగార్జున ను హోస్ట్ గా చేస్తూ ఈ షో ప్రసారం కాగా , ఆతర్వాత సిరీస్ కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసారు. ఇక ఇప్పుడు ఈ షో త్వరలో జెమినీ లో ప్రసారం కాబోతుంది. అయితే, ఇప్పుడు ఈసారి హోస్ట్ గా ఐదో సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ చేసి బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈసారి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ సందడి చేయబోతున్నారు. ఎన్టీఆర్ ఈసారి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తుండటంతో ఈ షో కోసం కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి మీలో ఎవరు కోటీశ్వరుడు షూట్ ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా రెండో దశ కారణంగా ఆగిపోయింది. కరోనా తగ్గుతున్న నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐదో సీజన్‌కి సంబంధించి గెటప్ ట్రయిల్స్ లోకి వచ్చారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసం.. పలు రకాల డ్రెస్ లు మార్చి, లైట్ గా గెటప్ మార్చి ఓ రోజంతా ఫొటో సెషన్ చేసారు. అయితే ఇంకా ఏ గెటప్ ఫైనల్ కాలేదని తెలుస్తుంది. జూలై నెలాఖరులు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ నుంచి ఫ్రీ అయిపోతారు. అప్పటి నుంచి మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ ల షూట్ ప్రారంభమయ్యే అవకాశం వుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తే టిఆర్పి రేటింగ్ కుమ్మేయడం ఖాయం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news