Moviesన‌టి శ్రావ‌ణి కేసులో సంచ‌ల‌న నిజాలు.. ముగ్గురితోనూ పెళ్లి చివ‌ర‌కు ఇలా...!

న‌టి శ్రావ‌ణి కేసులో సంచ‌ల‌న నిజాలు.. ముగ్గురితోనూ పెళ్లి చివ‌ర‌కు ఇలా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో చాలా వ‌ర‌కు చిక్కుముడులు వీడుతున్నాయి. ఇప్ప‌టికే ఆమెను వేధించి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన ఇద్ద‌రు నిందితులు దేవ‌రాజ్, సాయి కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో వీరిద్ద‌రితో పాటు ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్‌రెడ్డి కూడా నిందితుడే అని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ప‌రారీలో ఉన్న అశోక్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక శ్రావ‌ణి త‌ల్లిదండ్రుల‌ను మాత్రం నిందితులుగా చేర్చ‌డం కుద‌ర‌ద‌ని చెప్పారు.

 

2012లో హైద‌రాబాద్ వ‌చ్చిన శ్రావ‌ణి సినిమాల్లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించింది. ఆమెకు 2015లో సాయి కృష్ణారెడ్డితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. 2017లో అశోక్ రెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడింది. ప్రేమతో మీ కార్తీక్ సినిమాలో ఆమెకు చిన్న పాత్ర ఇవ్వ‌గా వారిద్ద‌రి మ‌ధ్య స్నేహం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఇక 2019లో దేవ‌రాజ్‌తో స్నేహం ఏర్ప‌డింది. దేవ‌రాజ్‌ను శ్రావ‌ణి పెళ్లి చేసుకోవాల‌ని అనుకోగా.. త‌ర్వాత దేవ‌రాజ్‌కు శ్రావ‌ణికి సాయి, అశోక్‌రెడ్డితో ఉన్న స్నేహం తెలిసి దూరం పెట్టాడు.

 

ఇక పై ముగ్గురు కూడా శ్రావ‌ణిని పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన వారే. ఆతర్వాత వేధించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంద‌ని పోలీసులు చెప్పారు. ఇక ఈ కేసులో మ‌రో నిందితుడు అయిన పరారీలో ఉన్న ఆర్ఎక్స్100 మూవీ నిర్మాత అశోక్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఏదేమైనా ముగ్గురూ పెళ్లి చేసుకుంటాన‌ని శ్రావ‌ణిని నమ్మించి వంచించార‌నే చెప్పాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news