Moviesచ‌నిపోయిన సౌంద‌ర్య భ‌ర్త మళ్లీ ఎవ‌రిని పెళ్లాడాడో తెలుసా..

చ‌నిపోయిన సౌంద‌ర్య భ‌ర్త మళ్లీ ఎవ‌రిని పెళ్లాడాడో తెలుసా..

క‌న్న‌డ క‌స్తూరి సౌంద‌ర్య చ‌నిపోయి 17 సంవ‌త్స‌రాలు అవుతున్నా ఇప్ప‌ట‌కి ఆమె ద‌క్షిణ భార‌త సినీ ప్రేమికుల మ‌దిలో అల‌గే నిలిచిపోయింది. ద‌క్షిణ భార‌త సినీప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది స్టార్ హీరోల‌తో న‌టించి ఎన్నో హిట్లు కొట్టిన ఆమెను ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఆడ‌ప‌డుచుగా భావించేవారు. ఏ పాత్ర‌లో అయినా సౌంద‌ర్య ఇట్టే ఒదిగిపోయేది. 2004 ఎన్నిక‌ల్లో బెంగళూరు నుంచి క‌రీంన‌గర్ బీజేపీ ఎంపీగా పోటీ చేసిన విద్యాసాగ‌ర్‌రావు ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళుతూ ఆమె హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందింది.

ఇక సౌంద‌ర్య త‌న మేన‌బావ అయిన ర‌ఘును పెళ్లాడింది. ఆ త‌ర్వాత యేడాదికే ఆమె చ‌నిపోయింది. ఆమె చ‌నిపోవ‌డానికి ముందే త‌న ఆస్తులు అన్నింటిని త‌న బావ‌, కం భ‌ర్త ర‌ఘు పేరు మీద రాసింది. ఆమె మృతి త‌ర్వాత ఆమె ఆస్తి కోసం సొంత కుటుంబీకులే కోర్టుకు ఎక్కారు. ఇక ఆమె త‌న ఆస్తి భ‌ర్త ర‌ఘు పేరు మీదే రాయ‌డంతో ఆ ఆస్తి అంతా ర‌ఘుకే వెళ్లింది.

సౌంద‌ర్య మ‌ర‌ణాంత‌రం ర‌ఘు అపూర్వ అనే మ‌హిళ‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ర‌ఘు గోవాలో స్థిర‌ప‌డి అక్క‌డ ప‌లు ర‌కాల బిజినెస్‌లు చేస్తున్నాడు. ఏదేమైనా ఓ మంచి న‌టి చిన్న వ‌య‌స్సులోనే కోట్ల మంది మ‌న‌స్సులు గెలుచుకుని ఈ లోకం విడిచి వెళ్లిపోవ‌డం బాధాక‌రం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news