Moviesనూత‌న్ నాయుడు భార్య దారుణం.. ద‌ళిత యువ‌కుడికి శిరోముండ‌నం

నూత‌న్ నాయుడు భార్య దారుణం.. ద‌ళిత యువ‌కుడికి శిరోముండ‌నం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని, పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ కుమార్‌ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మ ఇంట్లో ప‌నిమానేశాడ‌న్న కోపంతో నూత‌న్ నాయుడు భార్య మ‌ధుప్రియ క‌ర్రి శ్రీకాంత్ అనే యువ‌కుడికి శిరోముండ‌నం చేయించిన ఘ‌ట‌న శుక్ర‌వారం జ‌ర‌గింది. దీనిపై బాధితుడు పెందుర్తి పోలీస్టేష‌న్లో ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

 

పెందుర్తి గిరిప్ర‌సాద్ న‌గ‌ర్‌లో నూత‌న్‌నాయుడు ఇంట్లో క‌ర్రి శ్రీకాంత్ అనే యువ‌కుడు నాలుగు నెలల క్రితం ప‌నికి కుదిరాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ప‌నికి మానేశాడు. దీంతో నూత‌న్ నాయుడు భార్య మ‌ధుప్రియ శ్రీకాంత్‌కు ఫోన్ చేసి నువ్వు సెల్‌ఫోన్ తీశావు ఇంటికి రా… మాట్లాడాలి అన‌డంతో శ్రీకాంత్ నాయుడు ఇంటికి వెళ్ల‌గా అక్క‌డ అత‌డిని నిర్బంధించి…  సెలూన్‌ నిర్వాహకుడు రవిని పిలిపించి మధుప్రియ సమక్షంలో శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు. బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. దీంతో పోలీసులు నిందితురాలు మధుప్రియ సహా నలుగురిని జరిగిన ఘటనపై విచారిస్తున్నారు.

 

ఈ ఘ‌ట‌న‌లో నూన‌త్ నాయుడు పాత్ర‌పై సైతం పోలీసులు ఆరా తీస్తున్నారు. నూత‌న్ నాయుడు 2014లో జై స‌మైక్యాంధ్ర త‌ర‌పున పెందుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక ఈ కేసులో త‌న‌ను ఏమైనా చేస్తారేమోన‌న్న భ‌యంగా ఉంద‌ని.. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని బాధితుడు శ్రీకాంత్ కోరుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news