Moviesప‌వ‌న్ మ‌ళ్లీ మొఖానికి రంగేస్తున్నాడు...

ప‌వ‌న్ మ‌ళ్లీ మొఖానికి రంగేస్తున్నాడు…

ఇటీవ‌ల ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో జ‌న‌సేన దారుణంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. భారీ అంచనాలు, లక్షలాది అభిమానుల ఆశల‌తో రాజకీయాల్లోకి అడుడుపెట్టిన‌ పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం దారుణంగా విఫలమైంది. ఓట‌మిని అంగీక‌రిస్తూ తాను గెలుపోటములతో సంబంధం లేకుండా `నా కట్టె కాలేవరకూ ప్రజల్లోనే ఉంటా.. ప్రజలతోనే ఉంటా. నేను తిరిగి సినిమాల్లోకి వెళ్లేందుకు రాజకీయాల్లోకి రాలేదు` అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.

ఆయన తిరిగి సినిమాల్లోకి వెళ్తున్నారు అనే ప్రచారం అయితే ఆగడం లేదు. తాజాగా టాలీవుడ్‌లో ప‌వ‌న్ రీ ఎంట్రీపై గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ మైత్రీ మూవీస్, డివివి దానయ్యా, ఎఎమ్ రత్నంలను ఈ ముగ్గురు నిర్మాత‌ల ద‌గ్గ‌ర సినిమాలు చేస్తాన‌ని అడ్వాన్సులు తీసుకున్నాడ‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈ ముగ్గురు నిర్మాత‌ల‌ను పిలిచి క‌థ రెడీ చేసుకోండ‌ని గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని టాక్ న‌డుస్తోంది. సంవ‌త్స‌రానికి ఒక సినిమా చ‌ప్పున మూడు సంవ‌త్స‌రాలు.. మూడు సినిమాలు చేస్తాన‌ని చెప్పార‌ట‌.

అయితే ఇటీవ‌ల నరసాపురం పార్లమెంట్ కు సంబంధించిన జనసైనికులతో పవన్ చేసిన కామెంట్స్ లో మటుకు తన ఫిలిం రీ ఎంట్రీ గురించి ఎటువంటి స‌మాచారం ఇవ్వలేదు. ఓటమిలో మనతో నడిచే వాడే నిజమైన మిత్రుడు అని అంటూ తాను మళ్ళీ ప్రజాపోరాటాలు చేయడానికి రోడ్డు మీదకు వస్తాను అని ఉపన్యాసాలు చేశారే త‌ప్పా త‌న ఫిలిం రీ ఎంట్రీపై ఎటువంటి లీక్ ఇవ్వ‌లేదు.

సినిమాలు వ‌దిలి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను నిర్మాత‌ల ద‌గ్గ‌ర తీసుకున్న అప్పులు తీర్చ‌డానికి ముఖానికి రంగు వేసుకుని తిరిగి ప్రేక్ష‌కులు ముందుకు రాబోతున్నాడ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. త‌న‌కు ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా న‌చ్చితే అది ఫ‌స్ట్ చేస్తాన‌ని చెప్పార‌ట‌. ఇక ఆ ముగ్గురు నిర్మాతలు స్పెషల్ స్టోరీ టీమ్ లను ఏర్పాటు చేసి ప్రస్తుతం పవన్ కు ఉన్న ఇమేజ్‌కు ఎటువంటి కథ సరిపోతుంది అన్న విషయమై క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అయితే ఈ విష‌యం తెలిసిన అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెల‌కొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news