Gossipsఆ డైరెక్టర్ చేతిలో మోసపోయిన అల్లు అరవింద్

ఆ డైరెక్టర్ చేతిలో మోసపోయిన అల్లు అరవింద్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎన్ని అద్భుతమైన సినిమాలు నిర్మించారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘గీతా గోవిందం’ వంద కోట్లు దాటిపోయింది. తాజాగా అల్లు అరవింద్ టేకోవర్ చేసిన పేపర్ బాయ్స్ ఏమాత్రం రెస్పాన్స్ రాలేదు. అయితే సినిమా ఆడదనే విషయాన్ని రిలీజ్ కు ముందే ప్రివ్యూ చూసిన చాలామంది ప్రచారం చేశారు. ఈ విషయం అల్లు అరవింద్ కి తెలిసిందే..కానీ ఆయన తెలిసి మరీ ఆ సినిమా టేకోవర్ చేశారనేది అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం.
3
ఇంత అనుభవం ఉన్న అరవింద్, పేపర్ బాయ్ విషయంలో ఎందుకు దొరికిపోయారు. దీనివెనక మెహర్ రమేష్ మంత్రాంగం ఉందని సమాచారం. ఈ విషయంలో ముఖ్యపాత్ర వహించింది మెహర్ రమేష్. ఈ విషయాన్ని ప్రీ-రిలీజ్ ఫంక్ష్ లో అరవింద్ కూడా చెప్పిన విషయం తెలిసిందే. . ఎవరినైనా ఒప్పించడంలో, ఒకమాట మీదకు తేవడంలో మెహర్ రమేష్ దిట్ట అని, పేపర్ బాయ్ విషయంలో కూడా తనను మెహర్ అలాగే ఒప్పించాడని అరవింద్ అన్నారు.
2
ఇక సినిమా విషయానికి వస్తే..ఫుల్ లెన్త్ రొమాంటిక్ కాదు..అలా అని మాస్ ఎలిమెంట్స్ లేవు.. ఈ మద్య ఆడియన్స్ అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో ఈ సినిమా ఏ ఒక్కవర్గాన్ని ఈ పేపర్ బాయ్ ఆకట్టుకోలేకపోయింది. అలా మెహర్ రమేష్ కారణంగా అల్లు అరవింద్ ఇరుక్కుపోయారని అనుకోవాలి. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు మరో టాక్ వినిపిస్తుంది. గీతగోవిందం సినిమాతో భారీ లాభాలు రాబట్టిన అల్లు అరవింద్..ఇప్పుడు తన ఆదాయపు పన్ను నుంచి తప్పించుకునేందుకు, డిస్ట్రిబ్యూషన్ లో భారీ నష్టాలు చూపించడం కోసం పేపర్ బాయ్ ను అరవింద్ తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. 1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news