Gossipsపవన్ తల్లి ఫొటోలు మార్ఫింగ్.. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు

పవన్ తల్లి ఫొటోలు మార్ఫింగ్.. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అతని మీద కామెంట్స్ చేయడమే కాకుండా అతని కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం శ్రీ రెడ్డి పవన్ మదర్ మీద అనరాని మాటలనగా.. ఆ తర్వాత ఆమెపై పవన్ ఫ్యాన్స్ పగ తీర్చుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా కొందరు పవన్ తల్లి మార్ఫింగ్ ఫోటోలతో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

దీనిపై జనసేన కార్యకర్త శ్రవణ్ ఒకరు సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక రంగంలో దిగిన పోలీసులు ఆ ఫోటోలు ఏ ఐపి అడ్రెస్ నుండి అప్లోడ్ చేయబడ్డారో కనిపెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే చంటి అబ్బాయ్ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా పవన్ తల్లి అంజలి దేవి పిక్స్ షేర్ చేశాడు.

ఈ ఫోటోలు వైరల్ అవడంతో సైబర్ పోలీసులు రంగంలో దిగారు. పవన్ ను ఎదుర్కునే ధైర్యం లేకనే ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు కూడా ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news