Gossipsఎన్టీఆర్ కొడుకు బారసాలకి.. చీఫ్ గెస్ట్ బాలయ్యే..

ఎన్టీఆర్ కొడుకు బారసాలకి.. చీఫ్ గెస్ట్ బాలయ్యే..

ఈమధ్యనే ఎన్.టి.ఆర్ మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. తారక్ ఫ్యామిలీలోకి మరో కొత్త వ్యక్తిని ఆహ్వానించాడు. అతను వారసుడు కావడం విశేషం. రెండో కొడుకు పుట్టిన తర్వాత తారక్ మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాడట. ఇక ఆ బుడతడి 21వ రోజు అంగరంగ వైభవంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఇక ఈ వేడుకకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నందమూరి నట సింహం బాలకృష్ణ నిలుస్తారని తెలుస్తుంది. బాలయ్యకు స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించాలని చూస్తున్నాడట తారక్. తారక్, బాలయ్య మధ్యలో కళ్యాణ్ రామ్ ఈ వ్యవహారం సెట్ చేస్తున్నాడట. ఒకవేళ అదే జరిగితే మళ్లీ నందమూరి ఫ్యామిలీ హీరోలంతా ఒకటైనట్టే అవుతుంది. ఎన్.టి.ఆర్ కొడుకు బారసాలకు బాలయ్య గెస్ట్ గా వస్తే ఇక ఫ్యాన్స్ కు వచ్చే ఆ కిక్ వేరేలా ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news