Movies"ఏం మనుషులు రా బాబు..అస్సలు వాళ్లకి మాన్వతవం లేదా..?"..మహేశ్ బాబు ఎమోషనల్...

“ఏం మనుషులు రా బాబు..అస్సలు వాళ్లకి మాన్వతవం లేదా..?”..మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గానే గుంటూరు కారం సినిమాలో నటించిన మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు . దీనికోసం సపరేట్ డైటీషియన్ పెట్టుకొని మరీ డైట్ ఫాలో అవుతున్నాడు . వ్యాయామాలు చేస్తూ బాడీని తనదైన స్టైల్ లో మెక్ ఓవర్ చేసుకుంటున్నాడు .

రీసెంట్గా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తుంది . అసలు బుద్ధి లేదా..? వారికి మానవత్వం లేదా..? అంటూ మండిపడ్డారు . దానికి సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది. రీసెంట్ గానే మహేష్ బాబు పోచర్ అనే వెబ్ సిరీస్ చూశాడు . అది చూశాక ఆయన మైండ్ లో రకరకాల ప్రశ్నలు తిరుగుతున్నాయట .

ఇలాంటి సున్నితమైన దిగజాలను రక్షించమని కోరుతూ ఈ వెబ్ సిరీస్ ద్వారా పిలుపునిచ్చారు అని మహేష్ బాబు పోస్ట్ చేశారు. ఎమ్మి అవార్డు విన్నర్ దర్శకుడు రిచి మెహతా రూపొందించిన మలయాళ ఫారెస్ట్ క్రైమ్ సిరీస్ పోచర్ ఏనుగు దంతాల స్మగ్లింగ్ తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది ఈ సిరీస్ . కేరళ అడవుల్లో జరిగిన రియల్ స్టోరీని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం గమనార్హం. ఈ సిరీస్ కు అలియాభట్ నిర్మాతగా వ్యవహరించారు . ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సిరీస్ రీసెంట్ గా చూసిన మహేష్ బాబు చాలా ఎమోషనల్ గా స్పందించారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news