Moviesసినీ ఇండస్ట్రీలో మరో సంచలనం..విడాకులు ప్రకటించిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కన్నీళ్లు..!!

సినీ ఇండస్ట్రీలో మరో సంచలనం..విడాకులు ప్రకటించిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కన్నీళ్లు..!!

ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకున్న జంటలను మనం ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పిల్లలే విడాకులు తీసుకుంటూ ఉండడం గమనార్హం. రీజన్ ఏంటో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్లు పెళ్లయిన సంవత్సరాలకి ..రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకుంటూ షాక్ ఇస్తున్నారు. చాలామంది ఇప్పటికే విడాకులు తీసుకొని అభిమానుల మనసులను హర్ట్ చేశారు .

తాజాగా మరో స్టార్ క్రేజీ కపుల్ విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. బాలీవుడ్ హీరోయిన్ అయిన ఈశా డియోల్ తాజాగా తన భర్త భరత్ కు విడాకులు ఇచ్చేసింది . తమ మధ్య వచ్చిన దూరం కారణంగా పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకుని దూరంగా ఉండాలి అని నిర్ణయించుకొని విడిపోతున్నాము అంటూ ప్రకటించింది . అంతేకాదు తమ ఇద్దరి పిల్లల సంరక్షణ తమకు చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర – హేమమాలిని కూతురైన ఈషా డియోల్..2002వ సంవత్సరంలో “కోయి మేరా ది సే ” సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . సుమారు 30 సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది . అయితే చాలా చక్కగా సాగిపోతున్న వీళ్ళ సంసారంలో ఎందుకు గొడవలు వచ్చాయో తెలియదు కానీ విడిపోవడమే బెటర్ అంటూ విడాకులు తీసుకున్నారు. ప్రెసెంట్ వీళ్లు విడాకుల న్యూస్ వైరల్ గా మారింది. చక్కని జంట విడిపోతూ ఉండటంతో ఆమె ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news