Newsథియేట‌ర్ల‌లోనే కాదు... టీవీల్లో అతి పెద్ద అట్ట‌ర్‌ప్లాప్‌... నిఖిల్ ప‌రువు గంగ‌లో...

థియేట‌ర్ల‌లోనే కాదు… టీవీల్లో అతి పెద్ద అట్ట‌ర్‌ప్లాప్‌… నిఖిల్ ప‌రువు గంగ‌లో క‌లిసిపోయింది..!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌కు కార్తికేయ 2 సినిమాతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్‌ మొత్తం తుడుచుపెట్టుకుపోయేలా చేసిన సినిమా స్పై. నిజానికి ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్రచారం చేయాలనుకున్నారు. కథ‌ కూడా పాన్ ఇండియా అప్పిల్‌ ఉన్న కథను తీసుకున్నారు. అయితే నిర్మాతకు.. హీరోకు మధ్య ఎక్కడో తేడా వచ్చింది. సినిమాను హడావిడిగా విడుదల చేశారు. రిలీజ్‌కి ముందు ప్రమోషన్లు కూడా నిఖిల్ పెద్దగా పట్టించుకోలేదు.

తక్కువ ప్రచారంతో థియేటర్‌లోకి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై కూడా దారుణ పరాజయం ఎదుర్కొంది. శాటిలైట్ రైట్స్ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఈటీవీ రైట్స్ ద‌క్కించుకుంది. ఈ సినిమాను ప్రసారం చేస్తే కేవలం 1.48 టీఆర్పి రేటింగ్ మాత్రమే వచ్చింది. అలా స్పై వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా ఘోర పరాజయం చూసింది. కార్తికేయ 2తో వచ్చిన క్రేజ్ స్పై సినిమాతో క్యాష్ చేసుకోవాలని అనుకున్నాడు నిఖిల్.

పాన్ ఇండియా కథతో తెర‌కెక్కిన ఈ సినిమాకు కొన్ని రీ షూట్‌లు చేసి జాతీయ స్థాయిలో ప్రచారం చేద్దామని సినిమాను వాయిదా వేయాలని కోరాడు. అయితే నిర్మాత ససేమీరా అన్నాడు. రిలీజ్ డేట్ విషయంలో నిర్మాత కాంప్రమైజ్ కాలేదు. దీంతో నిఖిల్‌ కాస్త వెనక్కు తగ్గాడు. చివరకు నిర్మాత చెప్పిన తేదీన సినిమా రిలీజ్ చేశారు. థియేటర్లలో ప్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై కూడా ఫెయిల్ అయింది.

ప్రస్తుతం నిఖిల్ స్వయంభు అనే పిరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా కత్తియుద్ధం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు. ఈ సినిమాతో పాటు ఇండియన్ హౌస్ అనే మరో సినిమాను కూడా ఈ హీరో అనౌన్స్ చేశాడు. మరి ఈ రెండు సినిమాలు అయినా నిఖిల్‌కు హిట్ ఇస్తాయో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news