Newsరాజేంద్ర‌ప్ర‌సాద్ ఆ హీరోయిన్ మాయ‌లో పడి స‌ర్వం అర్పించేసుకున్నాడా... అప్ప‌ట్లో సెన్షేష‌న్‌..!

రాజేంద్ర‌ప్ర‌సాద్ ఆ హీరోయిన్ మాయ‌లో పడి స‌ర్వం అర్పించేసుకున్నాడా… అప్ప‌ట్లో సెన్షేష‌న్‌..!

నట కిరీటిగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. కామెడీ కింగ్ గా ఆయన టాలీవుడ్ ని ఏలిన దశ ఒకటుంది. అన్నగారు పెద్ద ఎన్.టి.ఆర్ నటనా స్పూర్తితో ఆయన సలహాతో ఓ కామెడీ హీరోగా ఇండస్ట్రీని ఏలడం అంటే అంత ఈజీకాదు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి కమర్షియల్ హీరోలున్నా రాజేంద్ర ప్రసాద్ కి ఓ ప్రత్యేక స్థానం దక్కిందంటే దానికి ఆయన ఎందుకున్న సినిమాలే.

కామెడీని నమ్ముకొని సినిమా చేయడం అంటే కత్తిమీద సాము. మహా అయితే 5 సినిమాలు లేదంటే పది సినిమాలు. కానీ, రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన సినిమాలు 100 కి పైగానే ఉన్నాయి. ఎర్రమందారం లాంటి ఛాలెంజింగ్ సినిమా కూడా చేసి రాజేంద్ర ప్రసాద్ మెప్పించారు. అహా నా పెళ్ళంట‌, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, మేడం..ఇవన్నీ రాజేంద్రుడు కామెడి చిత్రాలకి కేరాఫ్ అడ్రస్.

ఇక ఆ నలుగు లాంటి సందేశాత్మక చిత్రం ఆయన కెరీర్ లో మర్చిపోలేనిది. సిన్సియారిటీ ఆనయన బాగా ఫాలో అవుతారు. ఒకే ఒక్క సీన్ ఉన్నా ఆరోజు మొత్తం కేటాయించే నటుడు ఒక్క రాజేంద్ర ప్రసాద్ కావడం విశేషం. అయితే, ఈయన కెరీర్ లో కూడా చిన్న చిన్న మచ్చలున్నాయి. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ రజిని జంటకి మంచి పేరుంది. శశి కౌర్ మల్హోత్రా అసలు పేరు అయినప్పటికీ తమిళంలో అదే పేరుతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులో మాత్రం రజినిగా పాపులర్ అయింది.

అయితే, రజినికి రాజేంద్ర ప్రసాద్ కి మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు కొన్నాళ్ళు రిలేషన్ లో కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆ సమయంలో పెళ్లి చేసుకునే ఆలోచన ఉండి కూడా పరిస్థితులు అనుకూలించక ఆగిపోయారట. అయితే, ఆమె అంటే ఎంతో ఇష్టమున్న రాజేంద్ర ప్రసాద్ ఆర్ధికంగా చాలానే ముట్టచెప్పినట్టు టాక్ ఉంది. ఓ షోలో కూడా ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ చెప్పీచెప్పనట్టుగా చెప్పి తప్పించుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news