Newsహైద‌రాబాద్‌లో ఎన్టీఆర్ - జాన్వీ ఎక్క‌డ దిగారు... ఏం చేస్తున్నారంటే...!

హైద‌రాబాద్‌లో ఎన్టీఆర్ – జాన్వీ ఎక్క‌డ దిగారు… ఏం చేస్తున్నారంటే…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో తిరిగి లేని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ ముద్దుగా జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో అత్యంత క్రూరుడైన‌ విలన్‌పాత్రలో కనిపిస్తున్నారు.

కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత దేవర సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. దేవర రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతుంది. తొలిభాగం వచ్చే యేదాది సమ‌ర్‌ కానుకగా ఏప్రిల్ 5న థియేటర్లలోకి దిగనుంది. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గోవాలో మొదలైన ఈ సినిమా షూటింగ్ గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీతో పాటు సైఫ్ అలీఖాన్.. ఇతర ప్రధాన తారాగణం పాల్గొన్న కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఇక దేవర నెక్ట్స్‌ షెడ్యూల్ ఈ నెలాఖ‌రులో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది అని సమాచారం. హైదరాబాద్ సమీపంలో రంగారెడ్డి జిల్లాలో వేసిన ఓ సెట్‌లో ఎన్టీఆర్, జాన్వీక‌పూర్ మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

ఏదేమైనా ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావటంతో దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. దేనికి తోడు జాన్వీకపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ నటులు ఉండడంతో ఈ సినిమాపై నార్త్‌లో కూడా లెక్కకి మిక్కిలిగా అంచనాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news