Newsబాల‌య్య‌ను మ‌ళ్లీ పిల‌వ‌లేదా చిరు... చ‌ర‌ణ్ ఇంట్లో పార్టీ వెన‌క ఏం...

బాల‌య్య‌ను మ‌ళ్లీ పిల‌వ‌లేదా చిరు… చ‌ర‌ణ్ ఇంట్లో పార్టీ వెన‌క ఏం జ‌రిగింది…?

టాలీవుడ్ స్టార్ హీరోలు తాజాగా దీపావ‌ళి సంద‌ర్భంగా ఒక్క చోట చేరారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంప‌తులు త‌ల్లిదండ్రులు అయిన సంద‌ర్భంగా వీరు పార్టీ హోస్ట్ చేశారు. ఈ పార్టీలో టాలీవుడ్ సినీ సెల‌బ్రిటీలు, స్టార్లు అంద‌రూ ఇక్క‌డ క‌లుసుకున్నారు. ఇది మంచి ప‌రిణామం కూడా..! ఈ పార్టీ లో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత, యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి హాజ‌ర‌య్యారు.

అలాగే ఇటీవ‌ల కొత్త దంప‌తులు అయిన హీరో, హీరోయిన్‌లు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, మంచు మనోజ్, మౌనిక రెడ్డి, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, మంచు లక్ష్మీ, అక్కినేని అఖిల్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్ అంద‌రూ హాజ‌ర‌య్యారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు బాగా వైర‌ల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో అంద‌రిని బాగా ఎట్రాక్ట్ చేసిన ఫొటో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున కలిసి ఉన్న ఫోటో.

టాలీవుడ్‌లో నాలుగు ద‌శాబ్దాల నుంచి పోటీప‌డుతూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో ఉండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫ్రేమ్‌లో వీరి స‌మ‌కాలీన సీనియ‌ర్ స్టార్ హీరో బాల‌య్య మిస్ అయ్యారు. బాల‌య్య‌ను ఈ పార్టీకి పిల‌వ‌లేదా ? అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. మామూలుగా చిరు ఇంట్లో జ‌రిగే పార్టీల‌కు టాలీవుడ్‌లో త‌న తోటి సీనియ‌ర్ హీరోలు, హీరోయిన్లు అంద‌రిని పిలిచినా కానీ బాల‌య్య‌కు ఆహ్వానం ఉండ‌దు.

1980 స్ బ్యాచ్ అంటూ ఒక గ్రూప్ క్రియేట్ అయ్యింది. గ‌త కొన్నేళ్లుగా ఈ బ్యాచ్ హీరోలు, హీరోయిన్లు అంద‌రూ ప్ర‌తి యేటా రెగ్యుల‌ర్‌గా ఎక్క‌డో ఓ చోట క‌లుస్తూనే ఉంటారు. బాల‌య్య మాత్రం ఇందులో ఉండ‌డు. చిరంజీవి ఇంట్లో ఈ మీట్ జ‌రిగిన‌ప్పుడు బాల‌య్య‌కు ఆహ్వానం లేదు. ఓ సంద‌ర్భంలో బాల‌య్య ఓపెన్‌గానే త‌న‌ను పిల‌వ‌లేద‌ని కాస్త బాధ‌తో ఓపెన్ అయ్యారు.

ఈ 1980 స్ బ్యాచ్ హీరో, హీరోయిన్లు చెన్నై, బెంగ‌ళూరులో క‌లుసుకున్న‌ప్పుడు బాల‌య్య‌ను పిలిచేవారు. కానీ హైద‌రాబాద్‌లో చిరు ఇంట్లో జ‌రిగిన‌ప్పుడు మాత్రం చిరు బాల‌య్య‌ను పిల‌వ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ చిరు త‌న‌యుడు చ‌ర‌ణ్ ఇంట్లో జ‌రిగిన దీపావ‌ళి పార్టీలో టాలీవుడ్ సెల‌బ్రిటీలు అంద‌రూ ఉన్నారు. చిరు, నాగ్‌, వెంకీ ఒకే ఫ్రేమ్‌లో ఉండ‌డం ఆనంద‌దాయ‌క‌మే అయినా బాల‌య్య లేక‌పోవ‌డం ఆ ఫొటోకే కాదు.. టాలీవుడ్ సినీ జ‌నాలు అంద‌రికి లోటుగానే ఉంది.

మ‌రి ఈ ఫంక్ష‌న్‌కు కూడా బాల‌య్య‌ను పిలిచి ఉండ‌ర‌నే గుస‌గుస‌లు టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే టైంలో బాల‌య్య ఇటు అర‌వింద్‌, బ‌న్నీకి ద‌గ్గ‌ర‌వ్వ‌డంతో ఇప్ప‌టికే ఉన్న చిరు, బాల‌య్య గ్యాప్ మ‌రికాస్త పెద్ద‌ద‌య్యింద‌న్న టాక్ కూడా ఉంది. ఎన్ని ఉన్నా అంద‌రిని పిలిచిన‌ప్పుడు బాల‌య్య‌ను కూడా పిలిచి ఉండాల్సింద‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news