News"ఏంట్రా డార్లింగ్స్ మెంటల్ వచ్చేస్తుంది"..ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

“ఏంట్రా డార్లింగ్స్ మెంటల్ వచ్చేస్తుంది”..ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సందీప్ రెడ్డివంగ తెరకెక్కిస్తున్న సినిమా యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ హీరోయిన్ రష్మిక మందన్నా ఈ సినిమాలో నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి టీజర్ , పాటలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి .

డిసెంబర్ ఒకటిన ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ట్రైలర్ను లాంచ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా చాలా ఎఫెక్టివ్ గా అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా బోల్డ్ కంటెంట్ తో యాక్షన్ ధ్రిల్లర్గా ఫాదర్-సన్ సెంటిమెంట్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా ట్రైలర్ చూసి పలువురు స్టార్స్ సందీప్ రెడ్డివంగాను పొగిడేస్తున్నారు . ఈ క్రమంలోనే సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన ట్రైలర్ పై హీరో ప్రభాస్ ఎక్స్ట్రా ఆర్డినరీ కామెంట్స్ చేశారు . “ఇప్పుడే అనిమల్ ట్రైలర్ చూశా.. వాట్ ఎ ట్రైలర్ .. వాట్ ఏ ఫీల్ ..ఎక్స్ట్రాడినరీ ..మెంటల్ వచ్చేస్తుంది. కంగ్రాట్యులేషన్స్ “అంటూ పోస్ట్ చేశారు . దీంతో ప్రభాస్ రివ్యూ అనిమల్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news