Newsమంత్రి రోజా ప్రేమలో ఇన్ని ట్విస్టులా.. అన్నేళ్ల పాటు ప్రేమ‌లోనే ఉన్నారా..!

మంత్రి రోజా ప్రేమలో ఇన్ని ట్విస్టులా.. అన్నేళ్ల పాటు ప్రేమ‌లోనే ఉన్నారా..!

టాలీవుడ్ ఒకప్ప‌టి స్టార్ హీరోయిన్ రోజా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. తెలుగు చత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు అందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.. హీరోయిన్గా సక్సెస్ అయిన రోజు ఆ తర్వాత దర్శకుడు సెల్వమనేని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రోజా రాజకీయాల్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతుంది.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. అలాంటి మంత్రి రోజాపై ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అనుచితమైన కామెంట్లు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇదే తరుణంలో రోజా భర్త సెల్వమణి కూడా సత్యనారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ విధంగా గత వారం రోజుల నుంచి రోజా ఎప్పటికప్పుడు వార్తలో నిలుస్తుంది. ఈ క్రమంలోనే రోజాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదే సమయంలో రోజా లవ్ స్టోరీ గురించి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.. అసలు విషయం ఏమిటంటే.. రోజుది ప్రేమ వివాహం అనే విషయం చాలాందికి తెలియదు. అయితే దర్శకుడు సెల్వమణి రోజాని చాలా కాలం నుంచి ఇష్టపడ్డారట. అలా ఆమెతో సినిమాలు చేస్తున్న టైంలోనే వెళ్లి ఆమెను చూడటం వంటివి చేసేవారట. అలా చివరికి సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్లో రోజా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్లి రోజాకు ఐ లవ్ యు అని చెప్పాడట.

అంతేకాదు నీతో పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అంటూ డైరెక్ట్ గా రోజాతో చెప్పేసాడట. అప్పుడు రోజా షాక్ అయిపోయి ఆలోచనలో పడిందట. 1992 సమయంలో ఈ విధంగా సెల్వమణి ప్రపోజ్ చేసిన తర్వాత లవ్ లో పడ్డ రోజా పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ 2002లో చేసుకుంది. అంటే పదేళ్ల పాటు వీరు ప్రేమలో మునిగిపోయారు.

పదేళ్ల తరువాత రోజా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత వీరిద్దరికీ ఓ అమ్మాయి, ఓ అబ్బాయి పుట్టారు. ప్రస్తుతం సెల్వమణి తమిళ దర్శకుల సంఘంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. రోజా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో హాట్ హాట్ గా కొనసాగుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news