Newsపూరికి ఆ మాడా మొహం హీరోయిన్ ఎలా న‌చ్చింద‌బ్బా... అందుకే సినిమా...

పూరికి ఆ మాడా మొహం హీరోయిన్ ఎలా న‌చ్చింద‌బ్బా… అందుకే సినిమా దొబ్బిందిగా…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్‌ పరిచయం చేసే హీరోయిన్ అంటే ఓ క్రేజ్ ఉంటుంది. సినిమా రిలీజయ్యే వరకూ అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు జనాలలో ఓ ఆతృత ఉంటుంది. పూరి హీరోను ఎంత మాసీవ్ గా చూపిస్తారో హీరోయిన్‌ని అంత అందంగా చూపిస్తారు. యావరేజ్ హీరోయిన్ కూడా పూరి ఫ్రేం లో అప్సరసలా కనిపిస్తుంది. అంత అద్భుతంగా చూపిస్తారు.

ఇక రొమాంటిక్ సీన్స్ చూస్తే ఆ హీరోయిన్‌ని కొన్ని రాత్రిళ్ళు మర్చిపోవడం కష్టం. రేణు దేశాయ్, అమీషా పటేల్, అనుష్క శెట్టి, ఆయేషా టాకియా, ఆసిన్, రక్షిత, నిధి అగర్వాల్, నభా నటేష్..ఇలా ఆయన ఏ సినిమా చేసినా అందులో హీరోయిన్ ని చూస్తే మూడొచ్చేస్తుంది. అంత సెలక్టివ్‌గా ఉండే పూరి జగన్నాద్ ఇద్దరు హీరోయిన్స్ విషయంలో మాత్రం రాంగ్ స్టెప్ వేశాడు. వారే అదా శర్మ, శియా గౌతమ్మ్.

రవితేజ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా నేనింతే. ఈ సినిమాలో హీరోయిన్‌గా శియా గౌతమ్‌ నటించింది. ఈ అమ్మాయిని హీరోయిన్‌గా అనుకున్నప్పుడు పూరి టీం లో కొందరు ఆమెను వద్దని చెప్పారట. కానీ, పూరి జగన్నాద్ మాత్రం ఆ అమ్మాయి డెడికేషన్ నాకు నచ్చింది. తనే హీరోయిన్ అని తెగేసి చెపాడట. తీరా సినిమా రిలీజయ్యాక ఫ్లాపైంది. హీరోయిన్ మీదే ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.

అలా నెగిటివ్ కామెంట్స్ వినిపించిన మరో పూరి హీరోయిన్ అదా శర్మ. అమ్మాయి మంచి టాలెంటెడ్ అని పూరి తీసుకున్నారు. కానీ, సినిమా పోస్టర్ చూసిన కొందరు అంతా మాడా మొహం లాగా ఉంది. ఈ అమ్మాయి ఎలా నచ్చింది పూరికి అని కామెంట్స్ చేశారు. నితిన్ సరసన మరో హీరోయిన్ అయితే బావుండేదని మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నా అమ్మాయి అంత బాగోలేకపోవడంతో సినిమా దొబ్బిందని మాట్లాడుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news