Newsఈ ఫొటోలో చిరంజీవి హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా... ఆమె ఎవ‌రు.. ఇప్పుడేం...

ఈ ఫొటోలో చిరంజీవి హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా… ఆమె ఎవ‌రు.. ఇప్పుడేం చేస్తోందంటే..!

చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.. శంకర్ దాదా జిందాబాద్. కొరియోగ్రాఫ‌ర్ ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రాజ్‌కమర్‌ హిరానీ, పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథను అందించారు. చిరంజీవి కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలో సూపర్ హిట్ అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాలలో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పవ‌చ్చు.

ఇక శంకర్ దాదా జిందాబాద్ సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకు సీక్వెల్ అని అందరికి తెలిసిందే. ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం చేసారు. హీరో శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ కు థియేటర్ లలో నవ్వులు పూశాయి అని చెప్పచ్చు. హిందీలో సంజయ్ దత్ హీరోగా నటించిన లగే రహో మున్నాభాయ్ అనే సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వచ్చింది.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. 2007 లో రిలీజ్ అయినా ఈ సినిమా తో కరిష్మా కోటక్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. చూడ చక్కని రూపంతో,మొదటి సినిమా అయినా కూడా తన నటనతో కరిష్మా తెలుగు ప్రేక్షకులను అలరించింది. శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత కరిష్మా కోటక్ మరొక తెలుగు సినిమాలో నటించలేదు. మలయాళంలో ఒక సినిమా లో నటించిన తర్వాత ఈమె బాలీవుడ్‌కు వెళ్ళిపోయింది.

చివరకి తనకు ఇండియా కలిసి రాలేదనుకుందేమో కానీ లండన్‌లోనే సెటిలైపోయింది.. అయితే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన అప్‌డేట్స్ అన్నీషేర్ చేస్తుంటుంది. 40 ఏళ్ల కరిష్మా పోస్ట్ చేసే గ్లామరస్ ఫోటోస్, వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి.. ‘సాలిడి ఫిజిక్, హైట్.. సినిమాల్లో ఎందుకు సక్సెస్ కాలేదు.. రీ ఎంట్రీ ఇవ్వండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట కరిష్మా కొఠక్ పిక్స్ వైరల్ అవుతున్నాయి..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news