Movies20 ఏళ్ల త‌ర్వాత ఆ స్టార్ హీరోయిన్‌తో సినిమా చేస్తోన్న మ‌హేష్‌బాబు...!

20 ఏళ్ల త‌ర్వాత ఆ స్టార్ హీరోయిన్‌తో సినిమా చేస్తోన్న మ‌హేష్‌బాబు…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖ‌లేజా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా మంచి సినిమాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఖలేజా తర్వాత 12 ఏళ్ల గ్యాప్ తీసుకుని వీరిద్దరూ గుంటూరు కారం సినిమా కోసం మరోసారి చేతులు కలిపారు.

శ్రీ లీల – మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తోంది. ఆ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబుతో 20 సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తుండటం విశేషం. ఆ హీరోయిన్ ఎవరో ? కాదు సీనియర్ నటి రమ్యకృష్ణ. 20 క్రితం రిలీజ్ అయిన నాని సినిమాలో మొదటిసారిగా రమ్యకృష్ణ – మహేష్ బాబు కలిసి స్క్రీన్ పై కనిపించారు.

ఇక మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత మహేష్ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తోంది. ఏది ఏమైనా రమ్యకృష్ణ కూడా ఈ క్రేజీ ప్రాజెక్టులో జాయిన్ అయితే ఈ సినిమాకు మరో అదనపు హంగు యాడ్ అయినట్టే. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news