News17 ఏళ్ల తరువాత ..మళ్ళీ ఆ స్టార్ హీరోయిన్ తో జతకట్టబోతున్న...

17 ఏళ్ల తరువాత ..మళ్ళీ ఆ స్టార్ హీరోయిన్ తో జతకట్టబోతున్న చిరంజీవి.. సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ క్రేజీ కాంబో రిపీట్ చేయబోతున్నారా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ఎలా సినిమాలకు కమిట్ అవుతూ ఏ రేంజ్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడో. ఇప్పటికే గాడ్ ఫాదర్ – వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న చిరంజీవి .. ప్రజెంట్ భోళా శంకర్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెర కెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించిన 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత రెండు సినిమాలను లైన్ లో పెట్టుకుని ఉన్నాడు చిరంజీవి. అందులో ఒకరు వశిష్ట మరొకరు కళ్యాణ్ కృష్ణ. చిరంజీవితో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి వశిష్ట ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . ఇప్పటికే కథ వివరించగా చిరంజీవి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. ఈయన గతంలో కళ్యాణ్రామ్ తో కలిసి బింబిసారా తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా మెగాస్టార్ కోసం కళ్యాణ్ కృష్ణ విభిన్నమైన కథాంశం ఎంచుకున్నాడు అని.. ఇది కూడా చాలా వెరైటీగా ఉండబోతుంది అని తెలుస్తుంది . గతంలో నాగార్జునతో బంగార్రాజు లాంటి సినిమాను తీసి హిట్ కొట్టిన డైరెక్టరే ఈ కళ్యాణ కృష్ణ . ఇలా ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకున్న చిరంజీవి .. తన సినిమాలో హీరోయిన్గా త్రిషను ఫైనల్ చేస్తున్నారట. గతంలో ఆమె చిరంజీవి సరసన హీరోయిన్గా స్టాలిన్ అనే సినిమాలో నటించింది . ఈ సినిమా రిలీజ్ అయిన 17 ఏళ్లవుతుంది . 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అవుతూ ఉండడంతో ఫాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు..సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news