Moviesలాస్ట్ మూమెంట్లో దిల్ రాజు ప్లాన్ ఛేంజ్..చిరంజీవి పెద్ద గునపం దింపేసాడు...

లాస్ట్ మూమెంట్లో దిల్ రాజు ప్లాన్ ఛేంజ్..చిరంజీవి పెద్ద గునపం దింపేసాడు గా..!!

ఓ మై గాడ్ దిల్ రాజు మామూలోడు కాదు..అనంత పని చేసేసాడుగా. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి తాను చెప్పిన మాట జరగాలి అని కోరుకునే వ్యక్తిత్వం కలవాడు దిల్ రాజు అంటూ జనాలు చెప్పుకొస్తారు. ఎటువంటి హెల్ప్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో డిస్ట్రీబ్యూటర్ నుంచి టాలీవుడ్ ని శాసించే అగ్ర ప్రొడ్యూసర్స్ స్థాయికి ఎదిగిన దిల్ రాజు ..ప్రజెంట్ ఇద్దరు బిగ్ హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు.

మనకు తెలిసిందే ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి- నందమూరి బాలయ్య ఇద్దరు నటించిన సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంచుకున్నారు. ఎప్పుడు లేని విధంగా ఇలా ఇద్దరు బడా హీరోల సినిమాలు పక్కపక్క రోజున రిలీజ్ కావడం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రాధాన్యతను సంతరించుకుంది . అయితే ఇలాంటి క్రమంలోనే మధ్యలోకి దూరిన దిల్ రాజు తను నిర్మిస్తున్న వారసుడు సినిమాను ఇద్దరు బడా హీరోల సినిమాలకు కాంపిటీషన్ గా రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు .

దీని గురించి గత కొన్ని నెలలుగా బాక్స్ ఆఫిస్ వద్ద ఎలాంటి ఫైట్ జరుగుతుందో అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్గా దిల్ రాజు తెగించి మరో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు . దాదాపు వారసుడు సినిమాను ఎక్కువ ధియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర గుండెకాయ వైజాగ్ లో మేజర్ థియేటర్స్ వారసుడు చిత్రానికి దక్కాయి. సంగం, మెలోడీ థియేటర్స్ వారసుడు చిత్రానికి కేటాయించారు. ఇవి మేజర్ రెవెన్యూ ఇచ్చే థియేటర్స్ గా ఉన్నాయి.

ఇక వాల్తేరు వీరయ్యకు జగదాంబా థియేటర్ దక్కింది. దిల్ రాజు కాస్త తగ్గై వెనక్కి రాకపోతే మాత్రం ఖచ్చితంగా చిరంజీవి వాల్తేరు వీరయ్య కి.. బాలకృష్ణ వీరసింహారెడ్డికి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా కొంచెం కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి నెలకొలబోతుంది అంటూ భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. మొత్తంగా దిల్ రాజు లాస్ట్ మూమెంట్లో సడన్ షాక్ ఇచ్చి ఇద్దరు బడా హీరోలకి టెన్షన్ పుట్టిస్తున్నాడు . పొట్టోడే అయినా గట్టోడే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news