Moviesన్యూఇయర్ లో నయన్ న్యూ డెసీషన్.. విగ్నేశ్ శివన్ తూర్పు తిరిగి...

న్యూఇయర్ లో నయన్ న్యూ డెసీషన్.. విగ్నేశ్ శివన్ తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందేనా..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార.. సౌత్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది . స్టార్ హీరోలకు సైతం తన సినిమాలతో చెమటలు పట్టించే నయన్.. రీసెంట్ గా కనెక్ట్ సినిమాతో అభిమానులను పలకరించింది . అనుకున్న విధంగా ఈ సినిమా జనాలకు కనెక్ట్ కాకపోవడంతో జనాలకు నాయనతారకు మధ్య ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది . కాగా రీసెంట్ గా నయన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార ..డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . కాగా పెళ్లయిన నాలుగు నెలలకే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యి సోషల్ మీడియానే కాదు యావత్ ప్రపంచాన్ని తలకిందులుగా మార్చేసి షేక్ చేసింది . కాగా ఎట్టకేలకు ఆ వివాదాల నుంచి రిలీఫ్ అయిన నయనతార రీసెంట్గా భర్తకు షాక్ ఇస్తూ తాను ఇప్పటివరకు సంపాదించిన ఆస్తిని మొత్తం తల్లి తన ఇద్దరు కొడుకుల పేరిట రాయడానికి సిద్ధపడిందట .

మొన్నటి వరకు తన ఆస్తిని తల్లికి భర్తకి సరి సమానంగా పంచాలి అని చూసిన నయనతార .. కొడుకుల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ టైం లోనే వేణు స్వామి నయనతారపై చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్ . గతంలో వేణు స్వామి మాట్లాడుతూ..నయన్ జీవితంలో కూడా విడాకులు ఎదుర్కొనే సిచువేషన్ ఉందని చెప్పుకొచ్చాడు . ఆ భయంతోనే నయనతార తన కొడుకుల పేరు మీద ఆస్తి రాసేస్తుంది అంటూ ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకవేళ నిజంగా అది నిజమే అయితే విగ్నేశ్ తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే . ఎందుకంటే నయనతారతో కంపేర్ చేస్తే విగ్నేశ్ రేంజ్ , క్రేజ్, మనీ అని తక్కువే అన్న సంగతి అందరికీ తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news