Moviesబాలీవుడ్ సాక్షీగా తెలుగు హీరోల పరువు తీసిన రష్మిక మందన్నా .....

బాలీవుడ్ సాక్షీగా తెలుగు హీరోల పరువు తీసిన రష్మిక మందన్నా .. అందుకు మనోళ్లు పనికి రారా..!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నోటి దూల ఎక్కువైందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రష్మిక మందన పేరు ఏ రేంజ్ లో ట్రోల్ అవుతుందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో సంపాదించుకున్న క్రేజ్ ని మర్చిపోయి.. రష్మిక మందన తన స్థాయిని కూడా మరిచిపోయి మరి కామెంట్స్ చేస్తుందన్న వాదన కూడా వినిపిస్తుంది.

రీసెంట్గా కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో జరిగిన లొల్లి గురించి అందరికీ తెలిసిందే.ఏకంగా కన్నడ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసే ఆలోచన వరకు వెళ్లిందంటే.. ఆమె ఎంతలా కన్నడ ప్రజలను హార్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు . కాగా రీసెంట్గా అలాంటి ఓ బుర్ర తక్కువ కామెంట్స్ చేసి మరోసారి ట్రోల్ అవుతుంది రష్మిక మందన. ఆమె హిందీలో నటిస్తున్న సినిమా మిషన్ మజ్ఞు ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ..” అసలు రొమాంటిక్ సాంగ్ అంటే బాలీవుడ్ అని.. మిగతా భాషల్లో అంత మాస్ మసాలా, ఐటెం నెంబర్లే ఉంటాయని.. ఈ సాంగ్ కోసం నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని”.. ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ.. శ్రీవల్లి పాత్ర కూడా వేస్ట్ అనేంతలా కామెంట్స్ చేసింది.

దీంతో ఒకసారి రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. నీకు పాన్ ఇండియా క్రేజ్ తీసుకొచ్చిన పుష్ప సినిమాని అవమానిస్తావా..? నీకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమా..? అలాంటి భాషను ఇలా అవమానించడానికి సిగ్గు లేదా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏదిది ఏమైనా సరే రష్మిక టైం బాగోలేదు అన్నది మాత్రం నిజం అంటున్నారు కొందరు నెటిజన్స్ . చూడాలి మరి తన మాటలను రష్మిక ఎలా కవర్ చేసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news