Moviesభర్త ఏడుపు..ఆ ఒక్క మాటతో సుహాసిని పరువు మొత్తం పాయే..!?

భర్త ఏడుపు..ఆ ఒక్క మాటతో సుహాసిని పరువు మొత్తం పాయే..!?

అయ్యయ్యో అంతా అయిపోయింది.. భారీ అంచనాల నడుమ నిన్న థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ పార్ట్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ ని సంపాదించుకుంది. తమిళ్ జనాలు సైతం ఈ సినిమాను పరమ చెత్తగా ఉంది అంటూ రివ్యూ ఇచ్చారు. కథలో కంటెంట్ లేకపోవడం.. రాజుల కథ బుర్రకి ఎక్కకపోవడం ఒక మైనస్ అయితే..మణిరత్నం స్క్రీన్ ప్లే మరోసారి బూజు పట్టిన ఆయన మైండ్ ను తానే ప్రూవ్ చేసుకున్నాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం భారీ అంచనాలతో తెరకెక్కించిన సినిమా పోనియన్ సెల్వన్ పార్ట్ వన్ . ఈ సినిమా సుమారు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్లు సమాచారం. అంతే కాదు తమిళయన్స్ ఈ సినిమాను తమిళ్ బాహుబలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు. సీన్ కట్ చేస్తే బొమ్మ మొదటి షో పడగానే సినిమాలోని మ్యాటర్ అర్థం అయిపోయింది. సినిమాలో 50% కూడా కాదు కదా కనీసం బాహుబలి అనే పేరు కూడా పలకడానికి అర్హులు కాదు అంటూ జనాలు ట్వీట్ చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా విడుదల చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం మిక్స్డ్ టాక్ కూడా దక్కించుకోలేకపోయింది.

అయినప్పటికీ ఓవర్సీస్ తో పాటు తమిళనాడులో పోనియన్ రికార్డులు వసూలు అందుకుంటుంది . తెలుగు రాష్ట్రంలో అయితే పోనియన్ సినిమా అట్టర్ ఫ్లాప్ అని చెప్పాలి. అయితే ఈ సినిమాకి మొదట రివ్యూగా సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా పై తన రివ్యూ ను ట్విట్ చేశాడు ఉమైర్ సంధు. ఈ క్రమంలోని ఆయన సినిమాకు త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. దీంతో ఫైర్ అయిపోయిన మణిరత్నం భార్య సుహాసిని అసలు రివ్యూ ఇవ్వడానికి నువ్వు ఎవరు అంటూ ప్రశ్నించింది . ఉమైర్ సంధు రివ్యూ చూసిన సుహాసిని ఆగ్రహం వ్యక్తం చేసింది. ” రివ్యూ చెప్పడానికి అసలు మీరు ఎవరు..? ఇంకా విడుదల కాని సినిమాపై మీరు ఎలా రివ్యూ ఇవ్వగలరు..? అంటూ ఫైర్ అయింది”. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఉమైర్ సంధు ఈ సినిమాకి ఒక్కటే కాదు ప్రతి సినిమాకు సినిమా విడుదల అవ్వకముందే ఆయన తనదైన స్టైల్ లో రివ్యూ ఇస్తారు గతంలో రాధేశ్యామ్, ఆచార్య, ఆర్ఆర్ఆర్ అన్ని సినిమాలకు ఆయన రివ్యూ ఇచ్చారు. మరి అప్పుడు మాట్లాడని నోరు ఇప్పుడు లేస్తుంది ఏం సుహాసిని కి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు పోనియన్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మణిరత్నం ఈ సినిమా టాక్ చూసి ఏడుస్తున్నారట . అందుకే ఆమె తన బాధను ఎవరికి అంటగట్టాలో తెలియక ఉమర్ పై పడింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి మణిరత్నం ఖాతాలో మరో డిజాస్టర్ సినిమా పడిందని అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news