Moviesతెలుగు ఇండస్ట్రీ నాశనం అవ్వడానికి కారణం ఇదే..అమల సంచలన వ్యాఖ్యలు..!?

తెలుగు ఇండస్ట్రీ నాశనం అవ్వడానికి కారణం ఇదే..అమల సంచలన వ్యాఖ్యలు..!?

అమలాపాల్ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. మైన సినిమాతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు పరిచయమైన ఈ డస్కీ బ్యూటీ రఘు వరన్ బీటెక్ అనే సినిమా ద్వారా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో హీరో ధనుష్ తో ఆమె నటించిన తీరు చేసిన రొమాన్స్ రెండు జనాలను ఆకట్టుకున్నాయి. అంతేకాదు పలు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసి కూడా అమలాపాల్ పాపులర్ అయింది . మరీ ముఖ్యంగా ఆమె సినిమాలో న్యూడ్ గా నటించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

 

కాగా ఆమె టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడే దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పట్టుమంటే పది కాలాలు కూడా కాపురం చేయకుండానే విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది .ప్రజెంట్ అమల సింగిల్ గా ఉంటూ సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ వస్తుంది. రీసెంట్ గా ఓ తెలుగు మీడియాతో మాట్లాడిన అమల పాల్ ..తెలుగు ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి తెరలేపాయి.

ఆమె మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో పక్క భాష హీరోయిన్స్ ని ఆదరిస్తారే కానీ వాళ్లకి గ్లామరస్ రూల్స్ నే ఇస్తారు. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో నాలుగు కుటుంబాలే ఇండస్ట్రి ని ఏలేస్తున్నాయి. వాళ్లు వాళ్ళ తండ్రులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవరాలు, మనవళ్ళు అంటూ ఆ ఇండస్ట్రీకి మొత్తం ఆ నాలుగు కుటుంబాలే ఉన్నాయి. అంతేకాదు ఒక్కో హీరోకి ఇద్దరేసి హీరోయిన్లు కావాలి . కానీ కధలో భాగం కాకూడదు.. కేవలం గ్లామరస్ రోల్స్ కే పరిమితం అవ్వాలి. లేదంటే లిప్ లాక్ లు ..లేదంటే సాంగ్స్ ..అంతే తప్పిస్తే హీరోయిన్ లోని యాక్టింగ్ స్టైల్ వాళ్ళు గమనించరు. కానీ తమిళ్ ఇండస్ట్రీ అలా కాదు కచ్చితంగా హీరోయిన్ల పాత్రకి ఒక ప్రాధాన్యత ఉంటుంది. తమిళంలో నేను హీరోయిన్ గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను “అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమలాపాల్ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news