Moviesఆ హీరోయిన్ కెరీర్ నాశ‌నం చేసిన నాగార్జునే మ‌ళ్లీ ఆమెను ఆదుకుంటున్నాడా...!

ఆ హీరోయిన్ కెరీర్ నాశ‌నం చేసిన నాగార్జునే మ‌ళ్లీ ఆమెను ఆదుకుంటున్నాడా…!

అవకాశాలు కల్పించడంలో అవకాశాలు లేని వారిని ఆదుకోవడంలో కింగ్ నాగార్జునది పైచేయి అని చెప్పాలి. ఆయన సంస్థ నుంచి ఎప్పుడూ కొత్త టాలెంట్ బయటకు వస్తూనే ఉంటుంది. ఇక హీరోయిన్స్ విషయంలో నాగార్జున ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తుంటారు. రమ్యకృష్ణ లాంటివారిని కథకు అవసరమైతే మళ్ళీ తీసుకొస్తుంటారు. సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాలలో నాగ్ తన హిట్ పేయిర్ అయిన రమ్యకృష్ణను ఎంచుకున్న సంగతి తెలిసిందే.

నాగార్జున సినిమాతో ఎక్కువ శాతం క్రేజ్ తెచ్చుకున్నవారే తప్ప..దెబ్బైపోయిన వాళ్ళు చాలా తక్కువ. అలా దెబ్బైపోయిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. మంచి ఫాంలో ఉన్నప్పుడు రకుల్‌కి వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి. బిజీ హీరోయిన్‌గా ఉన్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాలో ఛాన్స్ వస్తే డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. ఆ త‌ర్వాత మ‌హేష్‌తో స్పైడ‌ర్ చేసింది అదే వేరే విష‌యం. అలాంటి రకుల్ ఇప్పుడు అవకాశాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది.

ఇక్కడ ఏ హీరో పిలిచి తన సరసన ఛాన్స్ ఇస్తాడా ? అని పర్సనల్‌గా కాంటాక్ట్ చేస్తుందట. ఇటీవల ఎక్కువగా గీతా ఆర్ట్స్ వారితో టచ్‌లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, అల్లు అర్జున్ కి మెసేజ్‌లు పెడుతుందని చెప్పుకుంటున్నారు. తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వమని కూడా ఇన్‌డైరెక్ట్‌గా కోరిందని ప్రచారం అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున మళ్ళీ రకుల్‌ని పిలిచినట్టు సమాచారం.

ఇంతకముందు నాగార్జున సరసన రకుల్ మన్మధుడు 2లో హీరోయిన్‌గా నటించింది. అయితే, రకుల్‌కి టాలీవుడ్‌లో కెరీర్ బాగా దెబ్బతినడానికి ఇదే సినిమా కారణం అయింది. దాదాపు తెలుగులో రకుల్ కనుమరుగైపోవడానికి మన్మధుడు 2 నే. ఆ సినిమాలో ముస‌లి వ‌య‌స్సులో ఉన్న నాగ్‌తో లిప్ లాక్ ఇవ్వ‌డాన్ని ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోయారు.

ఆ త‌ర్వాత ఆమెతో చేసేందుకు కుర్ర హీరోలు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే, తన వల్ల కెరీర్ దెబ్బైపోయింది కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చి రకుల్‌ను ఆదుకోవాలనుకుంటున్నారట నాగార్జున. మరి అది ఏ సినిమానో తెలియదు గాని, రకుల్ మాత్రం మళ్ళీ తెలుగు తెరపై కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news