Moviesఆ విషయంలో నో చెప్పిన ప్రభాస్.. సౌతిండియాలో ఇదే హాట్ టాపిక్..!

ఆ విషయంలో నో చెప్పిన ప్రభాస్.. సౌతిండియాలో ఇదే హాట్ టాపిక్..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తప్పు చేస్తున్నాడా..అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఈ హీరో..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. సినిమా రిలీజ్ అయ్యి..కొన్నీ ఏళ్ళు గడుస్తున్న ఇంకా ఆయనని అమరేంద్ర బాహుబలిగా నే గుర్తిస్తున్నారు. బాహుబలి సినిమా తరువాత..ప్రభాస్ రెండు సినిమాలు చేశాడు. రెండూ కూడా అట్టర్ ఫ్లాప్ టాక్ ను దక్కించుకున్నాయి. అయినా కానీ, పాన్ ఇండియా హీరో క్రేజ్ తగ్గలేదు.

ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈ హీరో..చేతిలో ఐదు ప్రాజెక్ట్స్ రెడీ గా ఉన్నాయి. అయినా కానీ, సార్ కి వరుస ఆఫర్లు ఇస్తున్నారు డైరెక్టర్స్. కాగా, రీసెంట్ గా ప్రభాస్ కు స్టోరీ వినిపించిన ఓ స్టార్ డైరెక్టర్ ని నిరాశ పరిచాడట డార్లింగ్ హీరో. దీంతో ఈ విషయం ఇందస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది . మనకు తెలిసిందే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా స్టార్స్ తో సినిమాలు తీసి వాళ్లకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు.

తమిళంలో ‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి.. ఇప్పుడు కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ అనే సినిమాతో కమల్ కెరీర్ కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా మారబోతున్నాడు లోకేష్ కనగరాజ్‌. దీంతో ఆయన పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది. అయితే, సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మీట్ అయ్యి..తాను అనుకున్న ఓ స్టోరీని వినిపించాడట.

అయితే, కధలో కొన్ని కీ పాయింట్స్ గజిబిజీ గా ఉన్నాయంటూ..బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పారట ప్రభాస్. దీంతో కనగరాజ్ ..సార్, స్టోరీలో ఆ లైన్స్ ఛేంజ్ చేస్తాను అని చెప్పినా వినకుండా…ఆయనను అవాయిడ్ చేశారట. దీంతో కనగరాజ్ బాగా హర్ట్ అయ్యిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాటర్ సినీ ఇండస్ట్రీలో హీట్ పెంచుతుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news