Moviesసీక్రెట్‌గా హీరోయిన్ మ‌ధుశాలిని పెళ్లి... భ‌ర్త బ్యాక్‌గ్రౌండ్ ఇదే...!

సీక్రెట్‌గా హీరోయిన్ మ‌ధుశాలిని పెళ్లి… భ‌ర్త బ్యాక్‌గ్రౌండ్ ఇదే…!

క‌రోనా లాక్‌డౌన్ టైం నుంచి అన్ని భాష‌ల‌కు చెందిన సినిమా వాళ్లు కంటిన్యూగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ముద‌రు బెండ‌కాయ‌లుగా ఉన్న హీరోలు ఒక్కొక్క‌రు ఒక్కో ఇంటివాళ్లు అయిపోతున్నారు. రీసెంట్‌గా సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార కూడా త‌న‌కంటే వ‌య‌స్సులో యేడాది చిన్నోడు అయిన ప్రముఖ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలైంది. ఆమె త‌న ఫ్యామిలీ లైఫ్ అప్పుడే స్టార్ట్ చేసేసింది.

ఇక ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అంద‌రికి షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ మ‌న తెలుగ‌మ్మాయే కావ‌డం మ‌రో విశేషం. ఆమె ఎవ‌రో కాదు మ‌ధుశాలిని. మ‌ధు 15 ఏళ్ల‌కు పైగానే ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నా హీరోయిన్‌గా ఆమెకు స‌రైన గుర్తింపు రాలేదు. చిన్నా చిత‌కా సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్ల‌దీస్తూ వ‌స్తోంది. ఇక ఇప్పుడు ఓటీటీల బాట ప‌ట్టి వెబ్‌సీరిస్‌లు కూడా చేసుకుంటోంది.

తాజాగా ఆమె 9 అవర్స్‌ వెబ్‌ సిరీస్‌తో అలరించింది. ఇక మధు శాలిని. తమిళ హీరో గోకుల్‌ ఆనంద్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. ఆమె వివాహం గురువారం హైద‌రాబాద్‌లో కొంత‌మంది స‌న్నిహితులు, బంధువుల స‌మ‌క్షంలో జ‌రిగింది. అయితే త‌న పెళ్లి గురించి ఆమె సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో అంద‌రికి తెలిసింది. త‌మిళ సినిమా పంచాక్ష‌రిలో మ‌ధుశాలిని, గోకుల్ క‌లిసి న‌టించారు.

ఈ మూవీ షూటింగ్ టైంలో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచయం కాస్తా ప్రేమ‌గా మారి చివ‌ర‌కు పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. మ‌ధుశాలిని ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అల్ల‌రి న‌రేష్ హీరోగా వ‌చ్చిన కిత‌కిత‌లు సినిమాలో రెండో హీరోయిన్‌గా చేసింది. అచ్చ తెలుగు అంద‌మే అయినా.. ఎందుకో గాని అంజ‌లిలా పేరు తెచ్చుకోలేక‌పోయింది.

కిత‌కిత‌లు త‌ర్వాత ఒక విచిత్రం, అగంతకుడు, కింగ్ (ఓ సాంగ్‌), వాడు-వీడు, గోపాల గోపాల వంటి తదితర సినిమాల్లో నటించింది. ఇక గోకుల్ అర‌డ‌జ‌ను త‌మిళ సినిమాలతో పాటు వెబ్‌సీరిస్‌ల్లో న‌టించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news