Moviesస‌మంత అబ‌ద్ధాల‌ సెటైర్లు ఎవ‌రికి... ఎవ‌రిని టార్గెట్ చేసింది...!

స‌మంత అబ‌ద్ధాల‌ సెటైర్లు ఎవ‌రికి… ఎవ‌రిని టార్గెట్ చేసింది…!

స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత కొత్త త‌ర‌హా వేదాంతంలో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. స‌మంత పెడుతోన్న పోస్టులు, ఆమె మాట‌లు అన్నీ కొత్త‌గా క‌నిపిస్తున్నాయి. కెరీర్ ప‌రంగా, సినిమాల ప‌రంగా మాత్రం స‌మంత ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. తెలుగులో శాకుంత‌లం,య‌శోద అనే థ్రిల్ల‌ర్ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో రెండు బోల్డ్ వెబ్ సీరిస్‌ల‌కు ఓకే చెప్పింది. హాలీవుడ్ ప్ర‌య‌త్నాల కోసం టెస్ట్ షూట్‌లో కూడా పాల్గొంది.

పెళ్ల‌య్యింది.. నాలుగేళ్లు కాపురం చేశాను అన్న భావ‌నే స‌మంత‌లో క‌న‌ప‌డ‌డం లేదు. ఆమె ఇప్పుడు ఓ ఫ్రీ బ‌ర్డ్ అయిపోయింది. మ‌రింత తెగించిన‌ట్టుగానే ఉంది. ఇక విడాకుల‌కు ముందు.. ఆ త‌ర్వాత కూడా స‌మంత సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల అర్థాలు వ‌చ్చేలా, ఇటు చైతు, అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేసేలా పోస్టులు పెడుతూనే వ‌స్తోంది.

తాజాగా స‌మంత సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టు బాగా వైర‌ల్ అవుతోంది. అయితే ఈ సారి ఆమె స‌మాజం, అబ‌ద్ధాల గురించి పోస్ట్ పెట్ట‌డం విశేషం. స‌మాజం అబ‌ద్ధాల‌కు ఇచ్చే ప్రాధాన్యం గురించి ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ స‌మంత పోస్ట్ పెట్టింది. నిజాలు అనేవి అరుదుగానే బ‌య‌ట‌కు వ‌స్తూ ఉంటాయ‌ని..కానీ స‌మాజం మాత్రం అబ‌ద్ధాలే ఎక్కువుగా న‌మ్ముతుంద‌ని చెప్పింది.

అయితే ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స‌మంత పెట్టిన పోస్ట్‌ను బ‌ట్టి చూస్తే జీవితంలో అబ‌ద్ధాల‌తో దెబ్బ‌తిన్న వ్య‌క్తిగా ఆమె త‌న‌ను తాను చెప్పుకున్న‌ట్టైంది. అంటే ఈ పోస్ట్ ద్వారా మ‌రోసారి ఆమె అక్కినేని ఫ్యామిలీతో పాటు చైతును టార్గెట్ చేసిందా ? అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి స‌మంత చైతుకు దూరం అయినా కూడా సోష‌ల్ మీడియా ద్వారా ఏదోలా వాళ్ల‌కు చుర‌క‌లు అంటిస్తోంద‌నే కొంద‌రు అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news