Moviesశ్రీకాంత్ కెరీర్‌లో మ‌ర్చిపోలేని సాయం చేసిన బాల‌య్య‌... కోట్ల ఆస్తి కాపాడిన...

శ్రీకాంత్ కెరీర్‌లో మ‌ర్చిపోలేని సాయం చేసిన బాల‌య్య‌… కోట్ల ఆస్తి కాపాడిన న‌ట‌సింహం…!

శ్రీకాంత్ తెలుగు వాడు అయినా పూర్వీకులు.. వాళ్ల ఫ్యామిలీ క‌ర్నాక‌ట‌లోని బ‌ళ్లారిలో సెటిల్ అవ్వ‌డంతో చిన్న‌ప్పుడు అక్క‌డే పెరిగాడు. ఆ త‌ర్వాత సినిమాల్లో రాణించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఇంట్లో చెప్పా పెట్ట‌కుండా చెన్నై చెక్కేశాడు. ఆ త‌ర్వాత చిన్న చిన్న సినిమాల్లో చిన్న పాత్ర‌లు వేసుకుంటూ ఎలాగోలా సీతార‌త్నం గారి అబ్బాయి లాంటి సినిమాల్లో విల‌న్ వేషాలు వేసుకునే స్థాయికి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత ఎన్నో క‌ష్టాలు ప‌డి హీరోగా క్లిక్ అయ్యాడు. ఒకానొక టైంలో టైరు హీరోల్లో స్టార్ హీరోగా ఉన్న శ్రీకాంత్ యేడాదిలో ఐదారు సినిమాలు చ‌క‌చ‌కా చేసేసేవాడు. అందులో మూడు, నాలుగు సూప‌ర్ హిట్లే ఉండేవి.

చివ‌ర‌కు శ్రీకాంత్ న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి హిట్ అయిన సంద‌ర్భాలూ ఉన్నాయి. తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ‌, స‌కుటుంబ స‌ప‌రివార‌స‌మేతం ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఆ త‌ర్వాత త‌న‌తో వ‌రుస‌గా సినిమాలు చేసిన హీరోయిన్ ఊహ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట‌కు ఇద్ద‌రు మ‌గ పిల్ల‌లు. ఓ కుమార్తె ఉన్నారు. ఇక హీరోయిన్ గోపీచంద్ భార్య శ్రీకాంత్ సొంత అక్క కుమార్తె.

శ్రీకాంత్ మెగా ఫ్యామిలీతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటాడు. త‌న గురువుగా మెగాస్టార్ చిరంజీవినే చెపుతూ ఉంటారు. ఇటు శ్రీకాంత్‌కు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తోనూ మంచి అనుబంధ‌మే ఉంది. బాల‌య్య తాజా సినిమా అఖండ‌లో శ్రీకాంత్ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా మెప్పించాడు. శ్రీకాంత్‌కు బాల‌య్య గ‌తంలో ఓ పెద్ద సాయ‌మే చేశాడు. శ్రీకాంత్ సినిమాల్లో బాగా సంపాదిస్తున్న‌ప్పుడే రియ‌ల్ ఎస్టేట్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల భూములు కొన‌డం.. వెంచ‌ర్లు వేయ‌డం అమ్మ‌డంతో మంచి లాభాలు వ‌చ్చాయి.

శ్రీకాంత్ రియ‌ల్ ఎస్టేట్ వ్య‌వ‌హారాలు అన్ని ఆయ‌న సోద‌రుడు అనిల్ చూసుకునేవాడు. అనిల్ కూడా తెలుగులో హీరోగా ఒక‌టి రెండు సినిమాలు చేశాడు. అయితే శ్రీకాంత్ ఎంతో సంపాదించి కొన్న కోట్ల రూపాయ‌ల ప్రాప‌ర్టీ ఓ సారి వివాదంలో ప‌డింది. అప్ప‌టి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత జి. వెంక‌ట‌స్వామి శ్రీకాంత్ కొన్న భూమిని త‌న‌దే అన్నాడు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. పైగా వెంక‌ట‌స్వామి సీనియ‌ర్ నేత‌. ఆయ‌నే త‌న భూమిని క‌బ్జా చేశాడ‌ని శ్రీకాంత్ ఆరోపించారు. అటు వెంక‌ట‌స్వామి వాళ్లు కూడా ఈ భూమి త‌మ‌దే అన్నారు.

హైద‌రాబాద్ స‌మీపంలోని రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి గ్రామంలో శ్రీకాంత్ తమ్ముడు పేరున ఈ భూమి ఉంది. దీని విలువ కోట్ల‌లోనే ఉంటుంది. అయితే ముందుగా శ్రీకాంత్ వాళ్లు ఇక్క‌డ వ్య‌వ‌హారాలు చేస్తున్నారు. రాత్రికి రాత్రే అక్క‌డ వాచ్‌మెన్‌ను త‌రిమేసి వెంక‌ట‌స్వామి వాళ్లు క‌బ్జా చేశారంటూ శ్రీకాంత్ ఆరోపించాడు. ఆ టైంలో శ్రీకాంత్ బాల‌య్య బాబు సాయం కోర‌డంతో బాల‌య్య త‌న ప‌లుకుబ‌డి ఉప‌యోగించి ఆ భూమి శ్రీకాంత్‌కు వ‌చ్చేలా చేశాడు. ఆ త‌ర్వాత శ్రీకాంత్ బాల‌య్య‌కు మాంచి పార్టీ కూడా ఇచ్చాడ‌ట‌. అది విష‌యం. అంతే కాదు శ్రీకాంత్‌కు త‌న అఖండ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ పాత్ర వ‌చ్చేలా చేయ‌డంలోనూ బాల‌య్య‌దే కీ రోల్‌..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news