Moviesఆ విషయంలో రాజమౌళి తోనే పోటీ..పూరి జగన్నాథ్‌ కి ఆ దమ్ముందా..?

ఆ విషయంలో రాజమౌళి తోనే పోటీ..పూరి జగన్నాథ్‌ కి ఆ దమ్ముందా..?

పూరి జగన్నాథ్‌.. ఈ పేరుకు పెద్ద గా పరిచయం అక్కర్లేదు. ఇప్పుదంటే ఒక్క హిట్ కొట్టాడాని ఇంత కష్టపడుతున్నారు కానీ..ఒకప్పుడు ఈయన సినిమా లు బాక్స్ ఆఫిస్ ని షేక్ చేశాయి అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిల అమ్మాయి, బద్రి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలతో టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. సినిమాకి 2-3 ఏళ్ళు తీసుకోవడం ఆయనకి చేత కాదు. సినిమా కమిట్ అయ్యామా..షూటింగ్ స్టార్ట్ చేసామా..రిలీ చేశామా..అంతే..!

ప్రజెంట్ విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ప్యాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా పుణ్యామా అని ఈ సినిమా లేట్ అయ్యింది కానీ లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యి..సరికొత్త రికార్డులు నెలకోల్పాల్సింది. కాగా.. ఈ సినిమా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘లైగర్’ విడుదలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండగానే ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రానున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత చార్మి తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు.

పూరీజగన్నాథ్‌ కలల ప్రాజెక్ట్‌గా ‘జనగణమన (జేజీఎం)’ త్వరలో పట్టాలెక్కనున్నదని అధికారికంగా ప్రకటించాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే కథతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో విజయ్ దేవకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో పూరీ విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని..కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు..ఈ సినిమా ద్వారా రాజమౌళి ని దాటేయాలని..అనుకుంటున్నారట. మనకు తెలిసిందే రాజమౌళి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో..ఎంత క్లీన్ గా క్లారిటీ గా ఉంటాయో..ఇక ఇప్పుడు అదే రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ JGM లో ఉండబోతున్నాయట. మరి చూడాలి రాజమౌళిని టచ్ చేసే దమ్ము పూరి కి ఉందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news