Moviesటాలీవుడ్‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా.. ఆ స్టార్ హీరోయిన్‌కూ పాజిటివ్‌..

టాలీవుడ్‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా.. ఆ స్టార్ హీరోయిన్‌కూ పాజిటివ్‌..

దేశంలో క‌రోనా మూడో వేవ్ తీవ్ర‌త‌రం అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే క‌రోనా మూడో వేవ్ ఇప్పుడిప్పుడే స్పీడ‌ప్ అవుతోన్న వేళ ఈ సారి ఎక్కువ మంది సెల‌బ్రిటీల‌కు క‌రోనా సోకుతోంది. సెకండ్ వేవ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ర‌కుల్‌ప్రీత్ – రామ్‌చ‌ర‌ణ్ – అల్లు అర్జున్ లాంటి వాళ్లు క‌రోనా భారీన ప‌డ్డారు. ఇక ఇప్పుడు థ‌ర్డ్ వేవ్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. మంచు ల‌క్ష్మి, మంచు మ‌నోజ్ కూడా క‌రోనా భారీన ప‌డ్డారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌రో హీరోయిన్ కూడా చేరింది.

 

కోలీవుడ్ సీనియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్ గారాల ప‌ట్టి అయిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఇటీవ‌ల త‌మిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువుగా విల‌క్ష‌ణ పాత్ర‌లు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. సందీప్‌కిష‌న్ సినిమాలో, ఇటు ర‌వితేజ క్రాక్ సినిమాలో లేడీ విల‌న్‌గా మెప్పించిన వ‌ర‌ల‌క్ష్మి ఇప్పుడు గోపీచంద్ మ‌లినేని – బాల‌య్య సినిమాలో కూడా కీల‌క పాత్ర‌కు ఎంపికైంది. ఆమె ఈ సినిమాఓల ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది.

ఈ సినిమాలో చ‌ర్చ‌ల కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన నేప‌థ్యంలోనే వ‌ర‌ల‌క్ష్మి క‌రోనా భారీన ప‌డింది. క్రాక్ సినిమాలో ఆమె న‌టించిన జ‌య‌మ్మ పాత్ర ఎంత పాపుల‌ర్ అయ్యిందో చూశాం. ఆ త‌ర్వాత నాంది సినిమాలో కూడా ఆమె చేసిన లాయ‌ర్ పాత్ర బాగా పాపుల‌ర్ అయ్యింది. స‌మంత లీడ్ రోల్ చేస్తోన్న య‌శోద‌లో కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

ఇదిలా ఉంటే హీరో నితిన్ భార్య‌కు కూడా క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని నితినే స్వ‌యంగా చెప్పాడు. త‌న భార్య హోం ఐసోలేష‌న్లో ఉన్నా కూడా నితిన్ దూరంగా ఉండి.. ఆమె పుట్టిన రోజు వేడుక‌లు సెల‌బ్రేట్ చేశాడు. క‌రోనా అడ్డంకులు క్రియేట్ చేసినా కూడా.. ప్రేమ‌కు అడ్డంకులు ఉండ‌వ‌ని ఓ కొటేష‌న్ కూడా కోట్ చేశాడు. ఏదేమైనా థ‌ర్డ్ వేవ్ లో సెల‌బ్రిటీలు వ‌రుస‌గా క‌రోనాకు గుర‌వుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news