Moviesఅమ్మో..ఈ హీరోయిన్ కి ధైర్యం ఎక్కువే..ఏం చేసిందో తెలుసా..??

అమ్మో..ఈ హీరోయిన్ కి ధైర్యం ఎక్కువే..ఏం చేసిందో తెలుసా..??

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి..చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ కు సంబంధించిన విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. వాళ్ళు ఏంచేసినా అది వెంటనే నెట్టింట వైరల్ గా మారుతుంది. అయితే తాజాగా ఓ హీరోయిన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి తెగ హల్ చల్ చేస్తుంది. ఇక ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు ఆమె ఏం చేసిందో ఒక్కసారి చూద్దామా..!!

నివేదా థామస్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్‌మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ నివేదా థామస్ ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తన అమదంతొ తన చలాకీ తనంతో..టాలివుడ్ లో తనకంటు ఓ స్పేషల్ స్దయిని ఏర్పర్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వచ్చిన ఉన్న పింక్ తెలుగు రీమేక్‌లోనూ నివేదా హీరోయిన్‌గా అదరగొట్టేసింది.

వకీల్ సాబ్ చిత్రంలోనూ నివేదా థామస్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఆమె యాక్టింగ్‌కు పవన్ కూడా ఫిదా అయినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కోర్ట్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో నివేదా పర్ఫార్మెన్స్‌కు చిత్ర యూనిట్ షాక్ అయ్యారట. బాల నటిగా కెమెరా ముందుకొచ్చిన నివేదా థామస్ తెలుగు చిత్రాలే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి బాగా ఫేమస్ అయ్యిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా నివేదా చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. ఇంతకి ఈ అమ్మడు ఏం చేసిందో తెలుసా..??..ఆమె స్వయంగా ఆవు దగ్గరకు వెళ్ళి పాలు పితుకొని వచ్చి.. చక్కటి కాఫీ పెట్టుకుంది. ఇంత వరకు బాగానే ఉంది.. కాగా.. ఈ తతంగాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో. ఆ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే కొంతమంది హీరోయిన్లు ఆవు దగ్గరకు వెళ్ళడానికే భయపడుతారు.. అలాంటి హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో ఈ అమ్మడు ఏం భయపడకుండా..ఆవు దగ్గరకు వెళ్లి.. పాలు పితికుతూ కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో చూసిన వారంతా నివేదా ను పోగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news