GossipsUnbelieveable Decision: ఆ డైనమిక్ డైరెక్టర్ కోసం విలన్ గా మారిన...

Unbelieveable Decision: ఆ డైనమిక్ డైరెక్టర్ కోసం విలన్ గా మారిన టాలీవుడ్ స్టార్ హీరో..??

ఇండియన్ సినిమా చరిత్రలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ చిత్రాలలో ఒకటి షారుక్ నటిస్తున్న ఓ సినిమా. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ దర్శకుడు అట్లీ ల కాంబోలో ప్లాన్ చేసిన ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ..మొన్ననే పూణే లో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం పాన్ ఇండియన్ వైడ్ భారీ అంచనాలనే నెలకొల్పుకుంది. ఈ సినిమాలో షారుఖ్‌ పాత్ర ద్విపాత్రాభినయం చేతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇక ‘లేడీ సూపర్ స్టార్ నయనతార’ ఈ సినిమాతో మొదటిసారి బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తోంది. అంటే సీనియర్ షారుఖ్‌ సరసన ఈ సౌత్‌ లేడీ సూపర్‌స్టార్‌ నటిస్తోంది. నయనతార గతంలో అట్లీతో ‘రాజారాణి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చ్దెప్పక్కర్లేదు. ఇక ముఖ్యమైన పాత్రలో ప్రియమణి కూడా నటించనున్నారు. కమెడియన్‌గా యోగిబాబు ఫిక్స్ అయ్యారట. తాజాగా షారుక్ చేయబోయే సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోను..విలన్ పాత్రకు ఎంపిక చేస్తున్నాడట అట్లీ.

ఆ స్టార్ హీరో ఎవరో కాదు ..టాలీవుడ్ కండల వీరుడు దగ్గుబాటి రానాను..ఈ సినిమాలో విలన్ పాత్రకు సెలక్ట్ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది. బాహుబలి తరువాత ఇండియా వైడ్ గా ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు అయిన రానా ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షారూక్ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని భావించి రాణా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తరువాత రానాకు ఎంత మంచి పేరు వస్తుందో చూడాలి.

కాగా మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాకు సాంకీ అనే టైటిల్ ను కూడా అనుకున్నట్టు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను షారుఖ్ తన రెడ్ చిల్లీస్ బ్యానర్ పై స్వయంగా నిర్మిస్తుండగా.. తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news