Gossipsట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు వెళ్తున్న ప్రభాస్‌ .. అసలు ఏమైందో తెలుసా..?

ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు వెళ్తున్న ప్రభాస్‌ .. అసలు ఏమైందో తెలుసా..?

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు మన డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదల కానుంది. ఇక మరో పాన్ ఇండియా సినిమా ‘సలార్’. ఈ సినిమా కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది.

ఇక అదే కాకుండా ప్రభాస్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆది పురుష్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ రామాయణం నేపథ్యంలో ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న సినిమా. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు క్రేజీ స్టార్ల‌తో ఈ సినిమాకు నేష‌న‌ల్ క్రేజ్ వ‌చ్చేసింది. అయితే ఈ సినిమా మొదలైన దగ్గరనుంచి ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

తాజాగా బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రం.. ముంబైలో జరిగిన షూటింగులో పాల్గొన్నారు. ఇక ఆ ఫోటోస్ ప్రభాస్ ఫిట్‌నెస్‌పై పట్టు కోల్పోయాడనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.ముఖమంతా వాడిపోయి.. విపరీతంగా లావెక్కినట్టు కనిపిచండంతో.. బహుబలి సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఫేస్ లో ఉన్న కల,లుక్,ఫిట్ నెస్..ఇప్పుడు లేవు అంటూ నెట్టిమట దీని పై భారీ డిస్ కషెన్స్ జరుగుతున్నాయి. ఇక దీంతో విసుకుచెంది..శ్రీరామచంద్రుడు పాత్రలో కనిపిస్తున్నందున బాడీలో సున్నితత్వం కనిపించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని సూచించారట స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ . అత్యవసరంగా లుక్‌ను, బరువును తగ్గించుకొంటే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారట. దాంతో ప్రభాస్ యూకే వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news