Moviesయాక్సిడెంట్‌కు గురైన సాయిధరమ్‌ తేజ్ బైక్ ధ‌ర ఎంతో తెలుసా..? దాని...

యాక్సిడెంట్‌కు గురైన సాయిధరమ్‌ తేజ్ బైక్ ధ‌ర ఎంతో తెలుసా..? దాని స్పెషాలిటి ఇదే ..!!

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్‌ బైక్‌ నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు గాయాలయ్యాయి. దాంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.

ఇక సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ఖరీదైన స్పోర్ట్స్ బైక్ గురించి చాలామంది ఆరా తీస్తున్నారు. అయితే ఈ ట్రైంప్ కంపెనీకి చెందిన ఈ స్పోర్ట్స్ బైక్‌ను కొద్ది నెలల క్రితం స్వయంగా సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు.

నిజానికి సాయి ధ‌ర‌మ్ తేజ్ కు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని మెగా ఫ్యాన్స్ కు తెలిసిందే. షూటింగ్ లేదంటే చాలు వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో క‌లిసి బైక్ పై తేజ్ దూసుకెళ్తుంటాడు. కానీ చాలా జాగ్రతలు తీసుకుంటాడు. నిన్న జరిగిన యాక్సిడెంట్ లో కూడా ఆయన హెల్మెట్ ధరిచ్కుంటే .. మెగా హీరో చాలా ఇబ్బంది అయి ఉండేది.

అయితే, ఈ బైక్‌ని రీసెంట్‌గా కొనుగోలు చేసిన తేజ్.. బండి నెంబర్ ట్శ్07 ఘ్ఝ్1258.ఈ బైక్ అనిల్ కుమార్ బురా పేరుతో రిజిస్ట్రేష‌న్ అయి ఉంది. ఇది స్పోర్ట్స్ బైక్. 1160సీసీ కెపాసిటీ. ఇది సరికొత్త హై ఎండ్ బైక్ అని చెప్పాలి. దీని బ‌రువు 228 కేజీల వ‌ర‌కు ఉంటుంది. క్ష‌ణాల్లో క‌నిపించ‌నంత వేగంగా దూసుకెళ్ల‌టం ఈ బైక్ స్పెషాలిటీ. ఈ బైక్ ధ‌ర 18ల‌క్ష‌లని తెలుస్తోంది.

ఈ బైక్ ని ఈ ఏడాది ఏప్రిల్ రెండోవారం అంటే సరిగ్గా ఐదు నెలల క్రితం సాయిధరమ్ తేజ్ హైదారాబాద్ లో లాంచ్ చేశాడు. ఈ బైక్‌పై అప్పుడే ఆయన మనసు పారేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ బైక్ మీద ప్రయాణిస్తున్న సమయంలోనే ఆయన యాక్సిడెంట్‌కు గురయ్యారు.

బైక్‌ను నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మాదాపూర్ పోలీసులు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news