Moviesమెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ కు యాక్సిడెంట్ అయ్యింది అందుకే.. నెమ్మదిగా...

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ కు యాక్సిడెంట్ అయ్యింది అందుకే.. నెమ్మదిగా బయటకివస్తున్న ఒక్కో నిజాలు..!!

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్‌ బైక్‌ నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు గాయాలయ్యాయి. దాంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్.. ప్రమాద స్థలిలోనే స్పృహ కోల్పోయాడు. దాంతో అతనికి మెడికవర్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇతర కుటుంబ సభ్యులంతా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

ఈ ప్రమాదం గురించి తాజాగా మాదాపూర్‌ ఏసీపీ స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్‌హెల్మెట్‌ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని తెలిపారు. రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయిందని చెప్పారు. స్కిడ్ కావడంతో సాయిధరమ్ తేజ్ బైక్‌ను అదుపు చేయలేకపోయారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

ఇక ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news