Moviesపూజా హెగ్డేకి అంత తలపొగరా..ప్రభాస్ తో అలా చేసిందేమిటి..?

పూజా హెగ్డేకి అంత తలపొగరా..ప్రభాస్ తో అలా చేసిందేమిటి..?

పూజా హెగ్డే.. టాలివుడ్ బుట్టబోమ్మ. 2014 లో ముకుంద అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ.. కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకుంది. కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈమె లేనిదే సినిమా తీయ్యలేం బాబోయ్ అనే రేంజ్ కు వచ్చింది.తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అని మరో అనుమానం లేకుండా చెప్తున్నారు. కన్నడ భామ పూజా హెగ్డే అన్ని భాషల కంటే తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో సతమతమైనా ఆ తర్వాత గేర్ మార్చింది.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. తన అందచందాలతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు పూజా హెగ్డే తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఆచార్య, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు.

అయితే గత కొద్ది రోజులుగా ఈమెకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అది ఏమిటంటే.. పాన్ ఇండియా హీరోగా దేశంలోనే నెంబర్ వన్ హీరోగా ఎదుగుతున్న ప్రభాస్ తో ఆమెకు విబేధాలు వచ్చాయట. వీరిద్దరూ కలిసి రాధే శ్యామ్ అనే సినిమా చేస్తుండగా సినిమా సెట్ లో పూజ హెడ్ వెయిట్ తో పొగరుగా బిహేవ్ చేసిందని..దాంతో ప్రభాస్ ఆమె తీరుతో విసిగిపోయారని .. ఈ కారణంగానే వీరిద్దరి మధ్య సినిమా లో లాస్ట్ సీన్స్ కెమిస్ట్రీ బాగా పండ లేదని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా దీనిపై రాధే శ్యామ్ చిత్ర బృందం స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్త అవాస్తవం అని..అలాంటి వార్తలను నమ్మకండి అని చెప్పుతూ..వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఫేక్ వార్తల పై క్లారిటీ ఇచ్చిన్నత్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news