Moviesలవ్ స్టోరీ పై మహేష్ బాబు రియాక్షన్..సాయి పల్లవి గురించి ఏమన్నాడో...

లవ్ స్టోరీ పై మహేష్ బాబు రియాక్షన్..సాయి పల్లవి గురించి ఏమన్నాడో తెలుసా..?

అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్ స్టొరీ మొత్తంగా వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని కలెక్షన్స్ సాధించింది.

తాజాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘లవ్ స్టోరీ’ మూవీపై అలాగే టీంపై సినీ తారల ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన మరో అందమైన ప్రేమ కథ ‘లవ్ స్టోరి’. కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజైంది. మొదటిరోజు నుంచే అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది చైతు – సాయి పల్లవిల లవ్ స్టోరి. ఈ మూవీపై పలువురు టాలీవుడ్ సినీ తారలు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు..ఈ సినిమా పై రియాక్ట్ అవుతూ ప్రశంసలు గుప్పించాడు. దైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల చిత్రాన్ని బాగా తెర‌కెక్కించాడ‌నిచెప్పుతూ.. చైతూ న‌టుడిగా చాలా ఎదిగాడు అని..ఇక హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి తెర‌పై మ్యాజిక్ చేసిందని.. తనలా డ్యాన్స్ చేసే వారిని చూడలేదని అన్నారు. ఇక పవన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమని, రెహమాన్ సార్ శిష్యుడు పవన్ అని విన్నానని మ‌హేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 6.45 కోట్ల షేర్ ని అందుకోవడం విశేషం. ఇక మూడో రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news