Moviesప్రభాస్ కి మిడ్ నైట్ ఆ డైరెక్టర్ కాల్ చేస్తే..ఏం చేస్తాడో...

ప్రభాస్ కి మిడ్ నైట్ ఆ డైరెక్టర్ కాల్ చేస్తే..ఏం చేస్తాడో తెలుసా..??

ప్రభాస్..చిన్న హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఇప్పుడు అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు. బాహుబలి ఈయన జాతకానే మార్చేసింది. ఒకప్పుడు కూడా ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, ఈ రెంజ్ ఫాలోయింగ్ అయితే లేదనే చెప్పాలి. దిన్నంతటికి కారణం..బాహుబలి.

ఆ ఒక్క సినిమా వల్లే ప్రభాస్ ఇప్పుడు ఈ రెంజ్ లో ఉన్నాడు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈయన చేతిలో ఉన్నవని బడా ప్రజెక్ట్ లే. రాధేశ్యాం, సాలార్, ఆది పురుష్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ఈ ఆరు అడుగుల అందగాడు. ఇప్పటికే రాధేశ్యాం సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం సాలర్ సినిమా, ఆది పురుష్ తో పాటు నాగ్ అశ్విన్ సినిమా లైన్లో ఉన్నాయి.

ప్రభాస్‌ వ్యక్తిత్వం గురించి మనందరికీ తెలిసిందే. స్టార్‌ హీరోగా ఎదిగిన ఇప్పటికీ సింప్లిసిటీని మెయింటెన్‌ చేస్తుంటాడు. అంతేకాదు సెట్‌లో నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌తోనూ డార్లింగ్‌ సరదాగా ఉంటాడు. దీంతో అందరు ప్రభాస్ మనస్సు బంగారం అని చెబుతుంటారు. ఆయన ఫ్రెండ్ షిప్ కు ఇచ్చే వాల్యూ గురించి.. ఆఫ్ స్క్రీన్ లో అతని ప్రవర్తన గురించి ఇండస్ట్రీ జనాలు ఎప్పుడూ గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా డైరెక్టర్ వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి చెపుతూ..” నేను అర్థరాత్రి ఫోన్ చేసినా ప్రభాస్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడని” చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ కి వివి వినాయక్ అంటే చాలా ఇష్టమట. ప్రతుతం వి వి వినాయక్ ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అలాగే పవన్ కళ్యాణ్ – రానా కలిసి చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ రీమేక్ లో కూడా ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడు వినాయక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news